News February 4, 2025
మేడ్చల్: ఘట్కేసర్లో విషాదం.. ఒకరి మృతి

ఘట్కేసర్ ద్వారకానగర్లో విషాదం నెలకొంది. చిన్న చెరువు వద్ద ఉరి వేసుకుని ఓ వ్యక్తి మృతి చెందారు. స్థానికుల వివరాలు.. శేఖర్ మద్యం మత్తులో భార్యతో గొడవ పడేవారు. దీంతో ఇరువురి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఈ నెల 1న తండ్రి, అన్నదమ్ములతోనూ అతడు గొడవ పెట్టుకున్నాడు. అదే రోజు చిన్న చెరువు వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు స్పాట్కు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 9, 2026
హాని కలగకుండా చూడాలి: జనగామ కలెక్టర్

ఈ-వేస్ట్ వల్ల పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. జనగామ మండలం శామీర్పేట్ గ్రామ పరిధిలో గల డీఆర్సీ కేంద్రాన్ని సోమవారం ఆకస్మిక తనిఖీ చేసి వారు మాట్లాడారు. డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్లో జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి సక్రమంగా సేకరించాలని, ఇతర వ్యర్థాలను వర్గీకరించి పునర్వినియోగించాలన్నారు.
News March 9, 2026
జైనూర్: ఢిల్లీ వేడుకలకు సర్పంచ్కు ఆహ్వానం

జైనూర్ మండలం మార్లవాయి సర్పంచ్ కనక ప్రతిభకు ఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆహ్వానం అందింది. అహర్నిశలు కృషి చేస్తూ మార్లవాయిని ఆదర్శ జీపీ తీర్చిదిద్దారు. జీపీ అభివృద్ధికి ఐఎస్వో సర్టిఫికెట్తో పాటు రాష్ట్రస్థాయి అవార్డులు వచ్చాయి. దీంతో ఆమెకు ఈ గౌరవం లభించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ నెల 11న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో జరిగే వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు.
News March 9, 2026
NZB: ప్రజావాణి 103 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 103 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్ లతో కలిసి ఫిర్యాదుదారుల స్వీకరించారు


