News October 26, 2025

మేడ్చల్ జిల్లాలో రూ.325 కోట్ల ఎక్సైజ్ రాబడి

image

మేడ్చల్ జిల్లా పరిధిలో ఎక్సైజ్ శాఖకు సంబంధించిన రాబడి వివరాలను అధికారులు వెల్లడించారు. మల్కాజిగిరి ఎక్సైజ్ డివిజన్లో ఈ ఏడాది ఎక్సైజ్ శాఖకు రూ.152 కోట్లు, మేడ్చల్ ఎక్సైజ్ డివిజన్లో రూ.173 కోట్లు సమకూరినట్లుగా ఆ డిపార్ట్మెంట్ వెల్లడించింది. మొత్తం కలిపి రూ.325 కోట్లు సమకూరాయి. ఆదాయాన్ని మరింత పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా వివరించింది.

Similar News

News October 26, 2025

చిన్న శంకరంపేట: గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యం

image

చిన్న శంకరంపేట మండలం దరిపల్లి శివారులోని హల్దీ వాగులో గుర్తు తెలియని మహిళ శవం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతి చెందిన మహిళ ఎవరు అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గ్రామంలో ఎవరైనా తప్పిపోయారా లేదా ఇతర గ్రామాల నుంచి వచ్చిన మహిళ ఇక్కడ చనిపోయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News October 26, 2025

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

APPSC విడుదల చేసిన వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఫిషరీస్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (3), రాయల్టీ ఇన్‌స్పెక్టర్ (1), వార్డెన్(1), ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్(1) పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, BSc, BEd, MA, BSc(జియోలజీ), ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. వెబ్‌సైట్: https://portal-psc.ap.gov.in/

News October 26, 2025

విద్యాసంస్థలకు సెలవులపై కలెక్టర్లకు సీఎం ఆదేశం

image

AP: తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని, ఎక్కడా ప్రాణ-ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబు ఆదేశించారు. SMS, సోషల్ మీడియా, IVRS కాల్స్, వాట్సాప్‌ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. విద్యుత్, టెలికం, తాగునీటి సరఫరా నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు కలెక్టర్లు <<18106376>>సెలవులు<<>> ప్రకటించాలని టెలికాన్ఫరెన్స్‌లో చెప్పారు.