News February 3, 2025

మేడ్చల్ జిల్లాలో 29.48 లక్షల మంది ఓటర్లు

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు 29.48 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో పురుషులు 15.17 లక్షలు కాగా.. మహిళలు 14.30 లక్షలు, ఇతరులు 416 మంది ఉన్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండినవారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News November 11, 2025

గోరంట్లలో రామరాయల శాసనం గుర్తింపు

image

గోరంట్లలోని శ్రీమాధవరాయ స్వామి గుడిలో శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన అరవీటి రామరాయల శాసనాన్ని గుర్తించినట్లు చరిత్రకారుడు మైనాస్వామి చెప్పారు. సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. మాధవ రాయల గుడి ముఖ మండపం దక్షిణ ద్వారం పక్కన 9 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పు గల పెద్ద తెలుగు దానశాసనాన్ని గుర్తించానన్నారు. ఇది 1559 నాటిదని వివరించారు.

News November 11, 2025

కర్నూలు: నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్

image

నాలుగేళ్ల పాపను ఎత్తుకెళ్లిన మధును అరెస్టు చేసినట్లు కర్నూల్ టౌన్-4 సీఐ విక్రమ్ సింహ తెలిపారు. వెల్దుర్తి(M) బుక్కాపురానికి చెందిన మధు(22) సోమవారం పాపతో హైదరాబాద్‌కు వెళ్తుండగా ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పట్టుకుని చిన్నారిని తల్లికి అప్పగించారు. బాలిక తల్లి సునీత బిక్షాటన చేసుకుంటూ గుడి వద్ద నిద్రించేది. ఈ క్రమంలో మధు పాపను ఎత్తుకెళ్లి అమ్మేందుకు యత్నించాడని సీఐ తెలిపారు.

News November 11, 2025

‘రిచా’ పేరిట స్టేడియం

image

WWC విన్నర్ రిచా ఘోష్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. స్వరాష్ట్రం వెస్ట్ బెంగాల్‌లో నిర్మించే స్టేడియానికి ఆమె పేరు పెట్టాలని CM మమతా బెనర్జీ నిర్ణయించారు. అక్కడి సిలిగురిలోని 27 ఎకరాల్లో స్టేడియం నిర్మించాలని స్థానిక మేయర్‌కు సూచించినట్లు సీఎం తెలిపారు. స్టేడియానికి రిచా పేరు పెడితే భవిష్యత్ తరాలకు ప్రేరణగా ఉంటుందని చెప్పారు. కాగా ఇటీవల రిచాను ప.బెంగాల్ ప్రభుత్వం DSPగా నియమించిన విషయం తెలిసిందే.