News January 18, 2026
మేడ్చల్ జిల్లాల్లో SSC, INTER పరీక్షలు రాసేది ఎంతమందంటే..?

వచ్చేనెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు, మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను అధికారులు లెక్కించారు. 10వ తరగతి పరీక్షలకు 46వేల మంది, ఇంటర్ పరీక్షలకు 1.35 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ మేరకు పరీక్షా కేంద్రాల ఎంపికను అధికారులు వేగవంతం చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎగ్జామ్ సెంటర్లను ఎంపిక చేయనున్నారు.
Similar News
News January 21, 2026
ANU: డిగ్రీ 6th సెమిస్టర్ వైవా షెడ్యూల్ రిలీజ్

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో 6వ సెమిస్టర్ వైవా షెడ్యూల్ ను యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆరో సెమిస్టర్ వైవా జరుగుతోందన్నారు. విద్యార్థులు ఫిబ్రవరి 20వ తేదీలోపు ఫీజు చెల్లించాలన్నారు. అపరాధ రుసుం రూ.100తో 23వ తేదీలోపు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.
News January 21, 2026
KMR: దివ్యాంగుల ఉపకరణాలకు దరఖాస్తులకు ఆహ్వానం

దివ్యాంగుల ఉపకరణలను పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల తెలిపారు. తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ద్వారా శారీరక దివ్యాంగులకు, అంధులకు, బదిరీలకు బ్యాటరీ వీల్ చైర్స్, డిగ్రీ విద్యార్థులకు లాప్ టాప్స్ తదితర ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేయుటకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఆన్లైన్ (www.tgobmms.cgg.gov.in) లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News January 21, 2026
‘డ్రంక్ అండ్ డ్రైవ్’ ఉక్కుపాదం: 101 మందికి శిక్షలు!

ప్రమాద రహిత కామారెడ్డి జిల్లాగా మార్చేందుకు ప్రతి రోజూ తనిఖీలు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర స్పష్టం చేశారు. గత రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 101 మందికి కోర్టు శిక్షలు విధించగా, అందులో 31 మందికి ఒక రోజు జైలు శిక్ష పడింది. మొత్తం రూ. 1,01,000 జరిమానాగా విధించినట్లు ఎస్పీ వెల్లడించారు.


