News February 11, 2025
మేడ్చల్ జిల్లా వాసులకు రేషన్ కార్డులు (UPDATE)
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739204642629_15795120-normal-WIFI.webp)
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 33,435 మంది రేషన్ కార్డులు కావాలని దరఖాస్తులు చేసుకున్నారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యంత్రాంగం ప్రత్యేక వివరాలను విడుదల చేసింది. ప్రభుత్వానికి ఈ వివరాలను పంపామని స్పష్టం చేసింది. త్వరలోనే ప్రభుత్వం నుంచి నిర్ణయం రాగానే అందరికీ కార్డులు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
Similar News
News February 11, 2025
ఐనవోలు: పాడి పశువులపై మళ్లీ దాడి చేసిన హైనాలు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739257269636_1047-normal-WIFI.webp)
HNK జిల్లా ఐనవోలు మండలంలోని గరిమెళ్లపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా పాడి పశువులపై హైనా దాడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నిన్న రాత్రి మళ్లీ పొలం వద్ద ఉన్న ఎడ్లపై దాడి చేయడంతో కొమ్ములతో హైనాలను పొడవపోయాయి. ఈ క్రమంలో ఎడ్లకు పలుచోట్ల గాయాలు అయ్యాయి. పాక వద్ద పడుకున్న ప్రభాకర్ వివరాల ప్రకారం.. రెండు హైనాలు వచ్చాయి. తనపై కూడా దాడి చేయగా కర్రలతో బెదిరించినట్లు తెలిపాడు.
News February 11, 2025
కడప జిల్లాలో విషాదం.. తల్లి, కొడుకు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739256694781_60261505-normal-WIFI.webp)
కడప జిల్లా బి.కోడూరు మండలం గుంతపల్లిలో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో తల్లి, కుమారుడు మృతి చెందారు. తల్లి గురమ్మ, కుమారుడు జయసుబ్బారెడ్డి పొలానికి నీళ్లు పెడుతుండగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న బి.కోడూరు ఎస్ఐ రాజు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 11, 2025
వరంగల్ మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739253758459_18102126-normal-WIFI.webp)
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే ఈరోజు తేజ మిర్చి ధర తగ్గగా మిగతా మిర్చి ధరలు పెరిగాయి. నిన్న క్వింటా తేజ మిర్చి ధర రూ.13,400 పలకగా.. నేడు రూ.13,200 పలికింది. అలాగే 341 మిర్చికి నిన్న రూ.13,100 ధర రాగా.. నేడు రూ.13,350 ధర వచ్చింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.14,100 ధర రాగా.. ఈరోజు రూ.14,200కి చేరింది.