News October 13, 2025
మేడ్చల్: ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పౌరసరఫరాల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు సౌకర్యవంతమైన విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణం పరిశీలించాలని కమిషనర్ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సుగుణ భాయ్ పాల్గొన్నారు.
Similar News
News October 14, 2025
SC వర్గీకరణ.. మీ సేవల్లో కొత్త సర్టిఫికెట్లు తీసుకోవచ్చు: మంత్రి

TG: అన్ని మీసేవ కేంద్రాలను కొత్తగా ఉపవర్గీకరించిన షెడ్యూల్ కుల గ్రూపులతో అప్డేట్ చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ చట్టం నవంబర్ 15-2025, జీ.ఓ.ఎంఎస్. నంబర్ 9(షెడ్యూల్ కులాల శాఖ, 14-04-2025) ప్రకారం ఈ వర్గీకరణ వ్యవస్థను అమలు చేశామన్నారు. ఇకపై ప్రజలు తమ వర్గానికి సరిపడే ధ్రువపత్రాలను సులభంగా పొందవచ్చని, SC, ST, BC క్యాస్ట్ సర్టిఫికెట్ల రీఇష్యూ సదుపాయాన్ని కూడా ప్రారంభించామన్నారు.
News October 14, 2025
ములుగు: పర్యవేక్షణ బాధ్యత పొంగులేటికి సీఎం అప్పగించారు: సీతక్క

మేడారం జాతర పనుల పర్యవేక్షణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారని సీతక్క అన్నారు. సమ్మక్క, సారలమ్మల దర్శనానికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు. పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గద్దెల విస్తరణలో భాగంగా గ్రామస్థులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయడం లేదని, మాస్టర్ ప్లాన్ ప్రకారమే పనులు పూర్తి చేస్తున్నామన్నారు.
News October 14, 2025
శామీర్పేట్: కలెక్టరేట్ ముందు ఎమ్మార్పీఎస్ ధర్నా

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయిపై రాకేశ్ కిషోర్ అనే అడ్వకేట్ షూ విసరడాన్ని ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ ముందు ఎమ్మార్పీఎస్ నాయకులు ఈరోజు ధర్నా చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించిన ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. న్యాయమూర్తులకు రక్షణ కరవైందన్నారు.