News October 25, 2025

మేడ్చల్ మార్గంలో రైల్వే ETS అప్ గ్రేడేషన్ మంజూరు

image

మేడ్చల్, మహబూబ్‌నగర్, ధోనే మార్గంలో రైల్వే ఎలక్ట్రిఫికేషన్ అప్ గ్రేడేషన్ మంజూరైనట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రెస్ నోట్ విడుదల చేసింది. రైల్వే మినిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకోగా, ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టం (ETS) త్వరలోనే అమలు చేస్తామని పేర్కొంది. ఈ పనులు పూర్తయితే ఎలాంటి అవాంతరాలు లేకుండా రైళ్లు ప్రయాణించడానికి వీలుంటుందని అధికారులు తెలిపారు.

Similar News

News October 25, 2025

KSRTC బస్సుకు తప్పిన ప్రమాదం

image

పుట్టపర్తి మండలంలోని వెంకటగారిపల్లి గ్రామ సమీపంలో పుట్టపర్తి-గోరంట్ల ప్రధాన రహదారిపై కర్ణాటక ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల మేరకు.. పుట్టపర్తి నుంచి ప్రయాణికులతో బెంగళూరుకు వెళ్తుండగా బస్సు స్టీరింగ్ కట్ అయింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో డివైడర్ వైపు దూసుకెళ్లి ఆగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

News October 25, 2025

ఆక్వా సాగు చెరువులు తప్పనిసరిగా CAA కింద రిజిస్టర్ కావాలి: కలెక్టర్

image

ఉప్పునీటి ఆక్వా సాగు చెరువులు తప్పనిసరిగా కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (CAA) కింద రిజిస్టర్ కావాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. రిజిస్టర్ కాని చెరువులకు చట్టబద్ధత ఉండదని, సీఏఏ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఆక్వా సాగు నిర్వహించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 25, 2025

కృష్ణపట్నం పోర్టులో ఒకటవ ప్రమాదవ హెచ్చరిక

image

బంగాళాఖాతంలో ఉన్న తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తుపాను ఏర్పడే అవకాశం ఉండడంతో ఒకటవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్ట్‌లో ఒకటవ ప్రమాదవ హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.