News January 26, 2025
మేడ్చల్: 34,719 రేషన్ కార్డులకు సభల్లో ఆమోదం!

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో ప్రత్యేక గ్రామ, వార్డు సభలు ఇటీవల నిర్వహించిన అనంతరం తాజాగా రిపోర్టు వెల్లడైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం రేషన్ కార్డులు కావాలని దరఖాస్తు చేసుకున్న 34,719 మంది వివరాలను గ్రామ, వార్డు సభల్లో ఉంచారు. అనంతరం ఆమోదం సైతం తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. మరోవైపు అదే సభల్లో మరి కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు.
Similar News
News October 18, 2025
విశాఖ-పార్వతీపురం మధ్య స్పెషల్ ట్రైన్

దీపావళి రద్దీ దృష్య్టా ఈనెల 27 వరకు విశాఖ-పార్వతీపురం మధ్య మెము స్పెషల్ ట్రైన్ నడవనుంది. విశాఖలో ఉ.10కు బయలుదేరి పార్వతీపురం మ.12.20కు చేరుకుంటుంది. తిరిగి పార్వతీపురంలో మ.12.45కు బయలుదేరి బొబ్బిలి 1.10కు చేరుకుని విశాఖ సా.4గంటలకు వెళ్లనుంది. సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లి, డొంకినవలస, బొబ్బిలి, సీతానగరంలో ఆగనుంది. > Share it
News October 18, 2025
పిశాచ స్థానం పట్ల నిర్లక్ష్యం వద్దు: వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు

పిశాచ స్థానాన్ని నిర్లక్ష్యం చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ విషయం పట్ల అలసత్వం వహిస్తే ఇంట్లో ఉండేవారు ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘ఇంటి చుట్టూరా ప్రహరీకి నడుమ ఉండే ఖాళీ స్థలాన్ని పిశాచ స్థానంగా చెబుతారు. ఇది ఉంటేనే గాలి, వెలుతురు ఇంట్లోకి వస్తాయి. ఇవి ఆ గృహంలో నివసించే వారికి ఉత్తేజాన్ని కలిగిస్తాయి’ అని తెలిపారు.<<-se>>#Vasthu<<>>
News October 18, 2025
వచ్చేనెల 5న జాబ్ మేళా: తేజ భరత్

జిల్లాలోని ప్రతి మునిసిపాలిటీలో తృప్తి క్యాంటీన్, అరకు కాఫీ ప్రాంచైజీ వంటివి మెప్మా మహిళల ద్వారా ఏర్పాటు చేయాలని మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ భరత్ శనివారం అన్నారు. వచ్చేనెల 5న నిపుణ-మెప్మా ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పరిధిలోని నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు ప్రతి మునిసిపాలిటీ పరిధిలోని మెప్మా విభాగంలో నమోదు చేసుకోవాలన్నారు. 10 ఆపై చదివిన వారు అర్హులన్నారు.