News April 17, 2025
మేడ్చల్: 5నెలలుగా జీతాలు లేవని కార్మికుల వినతి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గ్రామపంచాయతీలలో పని చేస్తున్న కార్మికులకు గత 5 నెలలుగా జీతాలు రావడంలేదని సీఐటీయూ ఆధ్వర్యంలో మేడ్చల్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఇన్ఛార్జి డీపీవో సాంబశివరావుకు వినతిపత్రం అందజేశారు. కార్మికులకు 5 నెలల నుంచి జీతంఇవ్వకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి ఉన్నికృష్ణ, సుధాకర్, ప్రశాంత్ ఉన్నారు.
Similar News
News April 19, 2025
జనగామ జిల్లా చరిత్ర, ప్రత్యేకతలు ఇవే!

జనగామ జిల్లాకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది 11వ శతాబ్దంలో కల్యాణి చాళుక్యుల 2వ రాజధానిగా నిలిచింది. 1195-1323 వరకు కాకతీయుల పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. జనగామలో జైన తీర్థంకరుల శిల్పాలు కనుగొనబడ్డాయి. ఇది మేఘాలిథిక్ యుగంలో జైనిజం ప్రాచుర్యాన్ని సూచిస్తుంది. కాగా, జిల్లాలో జీడికల్ రామచంద్ర స్వామి, పాలకుర్తి సోమేశ్వరాలయాలు ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. మీది ఏమండలం? మీ గ్రామ ప్రత్యేకత కామెంట్ చేయండి.
News April 19, 2025
పెద్దపల్లిలో అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

పెద్దపల్లి జిల్లాలో అంతర్రాష్ట్ర ATM దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు డీసీపీ కరుణాకర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. దొంగలు రాజస్థాన్కు చెందిన ఇద్దరు సొంత అన్నదమ్ములుగా గుర్తించారు. గత కొద్దిరోజులుగా వస్తున్న ఫిర్యాదులపై పోలీసులు నిఘా పెంచి గాలించారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
News April 19, 2025
ములుగు: ఆ స్వామి నాభి చందనం సేవిస్తే.. సంతానం కలుగుతుంది!

తెలంగాణలోనే 2వ యాదగిరిగుట్టగా పిలుచుకునే మంగపేట మండలం మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 6వ శతాబ్దంలోని చోళ చక్రవర్తుల కాలంనాటి నుంచే ఈ ఆలయం ఉన్నట్లు చెబుతుంటారు. స్వామి వారి బొడ్డు నుంచి కారే ద్రవం(నాభి చందనం)కు ఓ ప్రత్యేకత ఉంది. ఆ ద్రవం సేవిస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. ఎంతోమందికి సంతానం కలిగిందని ఇక్కడి అర్చకులు చెబుతుంటారు.