News March 24, 2024

‘మేమంతా సిద్ధం’ సభను జయప్రదం చేయండి: మంత్రి అంజద్ బాషా

image

సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రొద్దుటూరు నుంచి ఈనెల 27న ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రి అంజద్ బాషా, మేయర్ సురేశ్ బాబు అధ్యక్షతన కడపలో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా సభ నిర్వహణకు తీసుకోవాల్సిన అంశాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. సభకు భారీగా ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని కోరారు.

Similar News

News April 13, 2025

కడప జిల్లాలో గత ఐదేళ్ల ఇంటర్‌ ఫలితాలు ఇవే..

image

☛ 2021 అకడమిక్‌ ఇయర్‌లో కరోనా కారణంగా 100 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత
☛ 2022లో ఇంటర్‌ ఫస్టియర్ 41 శాతం.. సెకండియర్ 50 శాతం ఉత్తీర్ణత
☛ 2023లో ఫస్టియర్ 46 శాతం, సెకండియర్ 60 శాతం ఉత్తీర్ణత
☛ 2024లో ఫస్టియర్ 55 శాతం, సెకండియర్ 69 శాతం ఉత్తీర్ణత
☛ 2025లో ఫస్టియర్ 61 శాతం, సెకండియర్ 75 శాతం ఉత్తీర్ణత
కరోనా సమయంలో తప్ప ప్రతి ఏడాది కడప జిల్లా ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరుగుతూ పోతోంది.

News April 13, 2025

వేంపల్లి: 10వ తరగతి బాలికపై అత్యాచారం

image

వేంపల్లి మండలంలోని పదో తరగతి బాలికపై ఫాజిల్ అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. ‘ఇటీవల బాలికను వేంపల్లె గాంధీరోడ్డులో చికెన్ దుకాణంలో పనిచేసే ఫాజిల్ కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసును నమోదు చేశాం. అలాగే అతడికి సహకరించారని చికెన్ దుకాణం ఓనర్ ఆనంద్‌పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని సీఐ తెలిపారు.

News April 13, 2025

వైసీపీ పీఏసీ కమిటీలో కడప జిల్లా నాయకులకు చోటు

image

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో కడప జిల్లాకు చెందిన నాయకులకు అధిష్ఠానం చోటు కల్పించింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాలకు పీఏసీ కమిటీలో స్థానం కల్పిస్తూ  వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ పీఏసీ కన్వీనర్‌గా సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు ఉంటారు.

error: Content is protected !!