News January 31, 2025

మేళ్లచెరువు జాతరకు రూ.కోటి మంజూరు

image

మేళ్లచెరువు జాతరకు నిధులు మంజూరయ్యాయి. శ్రీఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా నిర్వహించే మహాశివరాత్రి జాతరకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసినట్లు ఈఓ కొండారెడ్డి తెలిపారు. మంత్రి ఉత్తమ్ ప్రత్యేక చొరవ తీసుకొని దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News January 7, 2026

జీరో టిల్లేజ్ పొద్దుతిరుగుడు సాగు – కలుపు నివారణ

image

జీరో టిల్లేజ్ పొద్దుతిరుగుడు సాగులో కలుపు నివారణకు మొదటి 20- 25 రోజులు కీలక దశ. వరికొయ్యలపై పొద్దుతిరుగుడు విత్తిన రోజు ముందుగా లీటరు నీటికి పారక్వాట్ కలుపు మందు 5mlను కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 24-48 గంటలలోపు తేమ గల నేలపై పెండిమిథాలిన్ కలుపు మందును లీటరు నీటికి 5 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. పంట 25-30 రోజుల దశలో లీటరు నీటికి క్విజాలోఫోప్ ఈథైల్ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

News January 7, 2026

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 4,6,4,6

image

సౌతాఫ్రికా U-19తో మూడో వన్డేలో భారత విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయారు. 7వ ఓవర్లో వరుసగా 4,6,4,6 బౌండరీలు బాదారు. ఈక్రమంలోనే అతడు 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ప్రస్తుతం వైభవ్‌(56)తో పాటు ఆరోన్ జార్జ్(51) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ 10 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 111 రన్స్ జోడించారు.

News January 7, 2026

బడ్జెట్ సమావేశాల తర్వాత కేంద్ర క్యాబినెట్ రీషఫుల్?

image

బడ్జెట్ సమావేశాల తర్వాత కేంద్ర క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిలో భాగంగా పలువురు మంత్రులను తొలగిస్తారని సమాచారం. ముఖ్యంగా మాజీ బ్యూరోక్రాట్లను పక్కన పెడతారని భావిస్తున్నారు. వారి స్థానంలో పార్టీ సీనియర్లు, సంఘ్‌ సన్నిహితులకు చోటు లభిస్తుందని చెబుతున్నారు. కాగా EX బ్యూరోక్రాట్స్ అయిన జైశంకర్‌, హర్దీప్‌, అర్జున్‌ రాం, అశ్వినీ వైష్ణవ్‌ ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు.