News June 3, 2024

మైదుకూరుకు ఛాన్స్: ఆరా

image

కడప జిల్లాలో టీడీపీకి మైదుకూరు స్థానం ఒక్కటి గెలిచే ఛాన్స్ ఉందని ఓ ఇంటర్వ్యూలో ఆరా సర్వే సంస్థ ప్రతినిధి మస్తాన్ చెప్పుకొచ్చారు. అలాగే అంజాద్ బాషా స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల 12% ఓట్లు పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మరికొన్ని గంటల్లో ఇవి వాస్తవమా.. అవాస్తవమా అనేది తేలనుంది. దీనిపై మీ కామెంట్.

Similar News

News December 18, 2025

23న కడపలో రాయలసీమ AMCల ఛైర్మన్ల సమావేశం

image

ఈనెల 23న కడపలో రాయలసీమ జిల్లాల వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్ల సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా AMC ఛైర్మన్లను నియమించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రాయలసీమ పరిధిలోని 72 వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కడప రీజనల్ డైరెక్టర్ రామాంజనేయులు గురువారం తెలిపారు.

News December 18, 2025

వేంపల్లిలో మైనర్ బాలిక ప్రసవం

image

వేంపల్లిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక గర్భం దాల్చి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బాలికకు నొప్పులు రావడంతో పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ప్రసవం చేశారు. ప్రస్తుతం బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 18, 2025

AMCల రాబడి పెంచాలి: JDM రామాంజనేయులు

image

AMCల రాబడిని పెంచాలని రాయలసీమ JDM రామాంజనేయులు కార్యదర్శులకు సూచించారు. గురువారం కడపలోJDM రామాంజనేయులు అధ్యక్షతన కడప, అన్నమయ్య జిల్లాల AMCలపై సమీక్ష నిర్వహించారు. వంద శాతం లక్ష్యాలు సాధించాలని ఆయన ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల మిల్లులకు వెళ్లి పరిశీలించాలన్నారు. చెక్ పోస్టుల వద్ద నిఘా పెట్టాలన్నారు. సమావేశంలో DDM లావణ్య, ADM అజాద్, 20 మంది AMCల కార్యదర్శులు పాల్గొన్నారు.