News August 15, 2024

మైదుకూరు కుర్రాడికి రూ.56 లక్షల ప్యాకేజీ

image

మైదుకూరు పట్టణానికి చెందిన కృష్ణ చైతన్య యాదవ్ రూ.56 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించినట్లు తండ్రి కృష్ణయ్య పేర్కొన్నారు. మైక్రో సాప్ట్ వేర్ కంపెనీ నందు భారీ వేతనంతో ఉద్యోగం పొందినట్లు చెప్పారు. కృష్ణ చైతన్య ఐఐటీ ఢిల్లీ నందు విద్యాభ్యాసం పూర్తి చేసినట్లు చెప్పారు. అత్యధిక వేతనంతో ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులు, బంధువులు
పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News November 3, 2025

పెన్షన్ కోసం మూడేళ్లుగా ఎదురుచూపులు

image

భర్త మరణించి మూడేళ్లు గడిచినా పెన్షన్ కోసం ఇంకా ఎదురుచూస్తున్నట్లు గోపవరం(M) సండ్రపల్లికి చెందిన చెన్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. పెన్షన్ కోసం దరఖాస్తు చేసినా సచివాలయ అధికారుల నుంచి సరైన స్పందన లేదని వాపోయారు. అధికారులు కరుణించి, వితంతు పెన్షన్ మంజూరు చేయాలని వేడుకుంటున్నట్లు ఆమె కనీటి పర్యంతమయ్యారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.

News November 2, 2025

వరల్డ్ కప్.. వికెట్ పడగొట్టిన శ్రీచరణి

image

మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతోంది. ఇందులో భాగంగా కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన టీం ఇండియా బౌలర్ శ్రీచరణి వికెట్ పడగొట్టింది. సౌతాఫ్రికా 62 పరుగుల వద్ద ఉండగా ఆమె బ్యాటర్ బాష్(Bosch)ను రెండో వికెట్‌గా పెవిలియన్‌కు పంపింది.

News November 2, 2025

మాజీ ఉప రాష్ట్రపతిని కలిసిన మాజీ సైనికులు

image

కడప R&B గెస్ట్ హౌస్‌లో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడును ఆదివారం జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ మాజీ సైనికులు మర్యాదపూర్వకంగా కలిశారు. అందరూ కలిసి కట్టుగా ఐకమత్యంగా సంతోషంగా ఉండాలని వెంకయ్య చెప్పారన్నారు. తమ పట్ల మాజీ ఉప రాష్ట్రపతి చూపిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపామని వారు అన్నారు.