News August 18, 2025

మైదుకూరు: విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతి

image

మైదుకూరులోని పోరుమామిళ్ల రోడ్డులో ఎర్ర చెరువు సమీపంలో సోమవారం రాటాల పవన్ కుమార్ (38) అనే కౌలు రైతు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. వ్యవసాయం మోటార్ వేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయమై పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. రైతు మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News August 19, 2025

కడప జిల్లాలో 27 బార్లకు నోటిఫికేషన్ విడుదల

image

కడప జిల్లాలో 27 బార్ల ఏర్పాటుకు జిల్లా P&E అధికారి రవికుమార్ సోమవారం నోటిఫికేషన్ ఇచ్చారు. కడపలో 12, ప్రొద్దుటూరులో 7, బద్వేల్ 2, పులివెందుల 2, మైదుకూరు 1, జమ్మలమడుగు 1, ఎర్రగుంట్ల 1, కమలాపురంలో 1 బార్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. బార్ల లైసెన్స్‌ల కోసం అప్లికేషన్‌కు రూ.5 లక్షలు, లైసెన్స్ ఫీజు రూ.55 లక్షలు చిల్లించాలన్నారు. ఈ నెల 18 నుంచి 26 వరకు దరఖాస్తులు స్వీకరణ, 28న లాటరీ తీస్తారని ఆయన తెలిపారు.

News August 18, 2025

ఐదేళ్ల MSC కోర్సులో ప్రవేశానికి వైవీయూ దరఖాస్తులు

image

యోగి వేమన విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాలలో MSC ఎర్త్ సైన్స్ విభాగంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ అప్లైడ్ జియాలజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సంచాలకులు లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు 8985597928, 9985442196 నంబర్లను సంప్రదించాలన్నారు.

News August 18, 2025

చాపాడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి అక్కడికక్కడే మృతి

image

చాపాడు మండలం బద్రిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తి లారీకింద పడి స్పాట్‌లోనే చనిపోయాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.