News March 30, 2025
మైనర్లకు వాహనాలు ఇచ్చి చిక్కుల్లో పడొద్దు: VZM SP

మైనరు డ్రైవింగుతో చట్టపరమైన చిక్కులు తప్పవని ఎస్పీ వకుల్ జిందల్ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. 18 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వ్యక్తులు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. అటువంటి వ్యక్తులు డ్రైవింగు చేయుట వలన రహదారి ప్రమాదాలు, అనర్థాలు జరిగేఅవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైతే ప్రమాద భీమాను చెల్లించేందుకు సదరు భీమా కంపెనీలు నిరాకరిస్తాయన్నారు.
Similar News
News April 1, 2025
భీమిలి బీచ్లో విజయనగరం వాసి మృతి

భీమిలి బీచ్లో విజయనగరం జిల్లా వాసి సోమవారం మృతి చెందారు. గజపతినగరం ప్రాంతానికి చెందిన పరదేశి(37) భీమిలీ బీచ్లో స్నానానికి వచ్చాడు. స్నానం చేసిన అనంతరం ఒడ్డుపై కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని భీమిలి ఆసుపత్రికి తరలించారు.
News April 1, 2025
మాజీమంత్రి సుజయ కృష్ణరంగారావును కలిసిన వైసీపీ కౌన్సిలర్లు

మాజీమంత్రి సుజయ కృష్ణరంగారావును వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లు విశాఖలోని సోమవారం కలిశారు. మున్సిపల్ ఛైర్మన్ సావు మురళీ అభివృద్ధిలో పూర్తిగా విఫలమయ్యారని, ఎమ్మెల్యే బేబినాయన చేస్తున్న అభివృద్ధికి సహకరించడం లేదని సుజయ కృష్ణరంగారావుకు తెలిపారు. అభివృద్ధి చేయడంలో విఫలం కావడంతో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైట్లు వివరించారు. వైసీపీ మద్దతుతో ఛైర్మన్ పదవి కైవసం చేసుకుంటామని మాజీమంత్రి చెప్పారు.
News April 1, 2025
VZM: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

విజయనగరం రైల్వే స్టేషన్లో రైలు నుంచి కాలుజారి పడటంతో పశ్చిమ బెంగాల్కు చెందిన ఛత్రిభాను(46) మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ బాలాజీరావు చెప్పారు. దిబ్రుగర్ నుంచి కన్యాకుమారి వెళ్తున్న రైలులో ప్రయాణం చేస్తున్న భాను విజయనగరం స్టేషన్లో వాటర్ కోసం దిగాడు. ఇంతలోనే రైలు కదలండంతో రైలులోకి ఎక్కుతుండగా కాలుజారి కిందపడి మృతి చెందిడని SI తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహారాజు ఆసుపత్రికి తరలించామన్నారు.