News March 20, 2024

మైలవరం: 11 మంది వాలంటీర్ల తొలగింపు

image

దొమ్మరనంద్యాల గ్రామంలోని 11 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు బుధవారం మైలవరం ఎంపీడీఓ శంషాద్ భాను ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17న జమ్మలమడుగు ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కార్యక్రమంలో పాల్గొని ఫోటోలు తీసుకోవడం, ర్యాలీలో వెళ్లడంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిచారని పేర్కొన్నారు. దీంతో వారిని తొలగించామన్నారు.

Similar News

News July 1, 2024

కేసుల పరిష్కారంలో కడప జిల్లాకు రెండో ర్యాంకు

image

జూన్ 29వ తేదీన ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 22 బెంచుల్లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. ఈ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 2367 కేసులను పరిష్కరించారు. ఇందులో క్రిమినల్ కేసులు 2036, సివిల్ కేసులు 217, ఫ్రీ లిటిగేషన్ కేసులు 114 పరిష్కారమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కేసుల పరిష్కారంలో జిల్లా రెండవ ర్యాంకులో నిలిచింది.

News July 1, 2024

చింతకొమ్మదిన్నె: పెళ్లికి తీసుకెళ్లలేదని ఆత్మహత్య

image

మండలంలోని అంగడివీధికి చెందిన ఓ బాలిక (16) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పెద్దముడియం మండలానికి చెందిన బాలిక అంగడివీధిలోని తన పిన్ని ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. కుటుంబ సభ్యులు తనని పెళ్లికి తీసుకువెళ్లలేదని మనస్తాపంతో అధిక మోతాదులో మాత్రలు మింగి అస్వస్థకు గురి కావడంతో, ఏలూరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

News July 1, 2024

ప్రొద్దుటూరు: అసలే మైనర్.. ఆపై ముగ్గురితో డ్రైవింగ్

image

మైనర్ బాలుడి వయసు 12 ఏళ్లు. మరో ముగ్గురిని స్కూటీలో కూర్చోపెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నాడు. నలుగురు పిల్లలు గాంధీ రోడ్డులో స్కూటీలో వెళ్తున్న దృశ్యం ఆదివారం ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ కంట పడి వారిని ప్రశ్నించారు. దుకాణానికి వచ్చినట్లు పిల్లలు తెలిపారు. వెంటనే వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులను హెచ్చరించినట్లు డీఎస్పీ తెలిపారు.