News October 27, 2025
మొంథా ఎఫెక్ట్.. ఏయూలో ఇంటర్వ్యూలు వాయిదా

మొంథా తుపాన్ కారణంగా ఏయూలో రేపు జరగాల్సిన వివిధ ఇంటర్వ్యూలను వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తెలిపారు. ఈ ఇంటర్వ్యూలను నవంబర్ 6వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరిపాలన భవనంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాల్లో నిర్వహిస్తామని చెప్పారు. అర్హులైన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలు ఏయూ వెబ్సైట్లో పొందుపరిచారు.
Similar News
News October 27, 2025
$1B కాంట్రాక్ట్ రద్దు.. సైబర్ దాడుల వల్ల కాదు: TCS

Marks & Spencer కంపెనీ తమతో 1B డాలర్ల హెల్ప్డెస్క్ కాంట్రాక్టును ముగించడంపై TCS స్పందించింది. సైబర్ దాడులకు, కాంట్రాక్ట్ ముగించడానికి సంబంధం లేదని చెప్పింది. సైబర్ దాడి వైఫల్యాల వల్లే M&S కంపెనీ కాంట్రాక్టును పునరుద్ధరించలేదన్న టెలిగ్రాఫ్ కథనాన్ని తోసిపుచ్చింది. ‘సైబర్ దాడులు ఏప్రిల్లో జరిగాయి. కానీ మరో కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకునేందుకు జనవరిలోనే M&S టెండర్లు ప్రారంభించింది’ అని తెలిపింది.
News October 27, 2025
రాష్ డ్రైవింగ్పై గుంటూరు పోలీసుల ఉక్కుపాదం

రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారిపై గుంటూరు పోలీసులు రెండు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఉక్కుపాదం మోపారు. ప్రతి సంవత్సరం దేశంలో సుమారు 2లక్షల మంది ప్రమాదాల్లో చనిపోతున్నారని
ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. హెల్మెట్ ధరించి, నిబంధనలు పాటించడం అందరి బాధ్యత అని చెప్పారు. 18ఏళ్ల లోపు పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News October 27, 2025
విశాఖ: ‘29న టిఫన్, భోజనం ప్యాకెట్లను సిద్దం చేసుకోవాలి’

ఈనెల 28న గంటకు 150-200 KM వేగంతో తుపాను తీరం దాటే అవకాశం ఉందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారు. సోమవారం విశాఖ కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. తీరం దాటే ప్రభావంతో చాలా నష్టం వాటిల్ల వచ్చని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చన్నారు. తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు అల్పాహారం, భోజనం ప్యాకెట్లను అందించేందుకు యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు.


