News October 28, 2025

మొంథా తుపాన్.. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఎర్ర హెచ్చరిక!

image

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ తీవ్ర వాయుగుండంగా బలపడింది. తుపానుగా మారి గంటకు 90 నుంచి 110 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లికి రెడ్ అలెర్ట్ జారీ కాగా.. వరంగల్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అతి భారీ వర్షాలతో మొక్కజొన్న, పత్తి పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు సూచించారు.

Similar News

News October 28, 2025

వనపర్తి: రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

వర్ష సూచన ఉన్న నేపథ్యంలో జిల్లాలో రైతులు పంట కోతలు చేపట్టకుండా వాయిదా వేసుకునేలా సూచించాలని వ్యవసాయ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. అలాగే ఇప్పటికే పంట కోత చేపట్టిన రైతులు తమ ధాన్యాన్ని తడవకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆరబోసుకునే విధంగా తగు సూచనలు చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News October 28, 2025

రాత్రి 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత

image

బాపట్ల జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అధిక వేగంతో గాలులు వీసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని చెప్పారు. కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు, నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

News October 28, 2025

మంచిర్యాల: హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులకు శిక్ష

image

భీమారం మండలంలో హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు జైలు శిక్ష విధించింది. శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ తెలిపిన వివరాలు.. శంకరమ్మ అనే మహిళపై సమ్మయ్య,లింగయ్య అనే నిందితులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు తరలించారు. మంచిర్యాల అదనపు సహాయ సేషన్స్ న్యాయమూర్తి రామ్మోహన్ రెడ్డి సాక్షుల వాంగ్మూలాలు,ఆధారాలు పరిశీలించి మంగళవారం తీర్పు వెలువరించారు.