News October 30, 2025

మొంథా తుఫాను ప్రభావం.. పంట నష్టంపై మంత్రుల సమీక్ష

image

మొంథా తుఫాను ప్రభావం, భారీ వర్షాల నేపథ్యంలో సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిసి భేటీ అయ్యారు. కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లో పంట నష్టం తీవ్రంగా ఉందని పొన్నం ప్రభాకర్ వివరించారు. వెంటనే రైతులకు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తమ్ కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Similar News

News October 30, 2025

TU: గెస్ట్ ఫ్యాకల్టీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

image

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని లా కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా చేరడానికి నియామక చేపట్టినట్లు లా కళాశాల ప్రిన్సిపల్ ప్రసన్నరాణి తెలిపారు. LLM/ML లేదా సరిసమాన విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. నవంబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా కాలేజీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో సందర్శించాలన్నారు.

News October 30, 2025

కాగజ్‌నగర్: సైబర్ నేరగాడి అరెస్ట్

image

కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆన్ లైన్ ద్వారా రూ.45790 పోగొట్టుకొని ఫిర్యాదు చేసినట్లు CI కుమారస్వామి తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు D-4C బృందం ద్వారా సాంకేతిక ఆధారాలను సేకరించి MPకి చెందిన ఆశిష్ కుమార్ దోహార్‌ను పట్టకున్నారు. అతడి ఖాతాలోని రూ.34537.38 ఫ్రీజ్ చేసినట్లు CI వెల్లడించారు.

News October 30, 2025

దక్షిణాఫ్రికా సిరీస్‌కు శ్రేయస్ దూరం?

image

టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ మరో 2 నెలలపాటు కాంపిటీటివ్ క్రికెట్‌కు దూరమయ్యే అవకాశం ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో నవంబర్, డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే 3 మ్యాచుల వన్డే సిరీస్‌కు ఆయన దూరం కానున్నట్లు తెలుస్తోంది. జనవరిలో న్యూజిలాండ్ జరిగే ODI సిరీస్ నాటికి ఫిట్‌నెస్ సాధించే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో క్యాచ్ అందుకుంటూ ఆయన గాయపడిన సంగతి తెలిసిందే.