News October 27, 2025

మొంథా తుఫాన్.. విద్యుత్ శాఖ నుంచి కీలక ప్రకటన

image

మొంథా తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో NTR జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఉప్పలపాటి హనుమయ్య సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
విజయవాడ సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయం: 9440817561
విజయవాడ టౌన్ డివిజన్ కార్యాలయం: 7382623226
గుణదల డివిజన్: 6281703087
విజయవాడ రూరల్: 6281705138
నూజివీడు డివిజన్:8125533788.

Similar News

News October 27, 2025

HYD: ఎన్నికల ఖర్చులు తనిఖీ చేయనున్న అధికారులు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు తమ ఖర్చులు నమోదుచేసే రిజిస్టర్లను అధికారులు రేపు తనిఖీ చేయనున్నారు. పోటీలో ఉన్న 58 మంది అభ్యర్థులు తప్పని సరిగా చెక్ చేయించుకోవాలని ఎన్నికల పరిశీలకుడు సంజీవ్ కుమార్ లాల్ తెలిపారు. రేపటితోపాటు మరో 2 పర్యాయాలు (నవంబర్ 3, 9) రిజిస్టర్లను తనిఖీ చేస్తామని పేర్కొన్నారు.

News October 27, 2025

మాజీ మేయర్ హత్య కేసు తీర్పు 30కి వాయిదా

image

మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో న్యాయస్థానం దోషుల వాదనలు వినింది. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు తుది తీర్పు వెలువరించనున్నట్లు జడ్జి ప్రకటించారు. ఆ రోజున దోషులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు.

News October 27, 2025

జూబ్లీ బైపోల్స్: కీలకం కానున్న సినీ కార్మికులు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సినీ కార్మికుల ఓట్లు కీలకం కానున్నాయి. షేక్‌పేట, బోరబండ, కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, శ్రీనగర్‌కాలనీ, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో దాదాపు 24 వేల మంది సినీ కార్మికులున్నారు. దీంతో అభ్యర్థులు సినీ కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు తాపత్రయపడుతున్నారు. అందుకే సినీ ప్రముఖుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సుమన్ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారు.