News January 16, 2025

మొగల్తూరులో కొత్త అల్లుడికి 200 రకాల పిండి వంటలతో విందు

image

మొగల్తూరులో బుధవారం సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుడికి 200 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేశారు. మొగల్తూరుకి చెందిన విష్ణు ప్రియ, గుంటూరుకు చెందిన త్రిపురమల్లు వైష్ణవ్‌లకు గత ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. తొలి పండుగకు అల్లుడితో పాటు కుటుంబ సభ్యులను విష్ణు ప్రియ తల్లిదండ్రులు ఫణి, ఝాన్సీలు ఆహ్వానించారు.  వైష్ణవ్‌కు 200 రకాల పిండివంటలతో విందు ఏర్పాటు చేసి మర్యాద చేశారు.

Similar News

News February 5, 2025

భీమవరం: ప్రతిపాదనలు సిద్ధం చేయాలి..కలెక్టర్

image

గుర్రపు డెక్క నుంచి నారను తీసి బహుళ ప్రయోజనాలకు వినియోగించేలా గ్రామీణ్ ఫౌండేషన్ ప్రతిపాదనలను సిద్ధం చేసి అందజేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. మంగళవారం భీమవరం జిల్లా కలెక్టర్ కలెక్టర్‌లో ఫౌండేషన్ ప్రతినిధులు సమావేశమై గుర్రపు డెక్క ద్వారా వర్మీ కంపోస్ట్ తయారు చేసే ప్రాజెక్టుపై చర్చించారు. గుర్రపు డెక్కన్ డెక్కన్ వేట రూ .5 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు.

News February 5, 2025

ప.గో: నులిపురుగుల నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ 

image

ఈనెల 10న నిర్వహించే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం భీమవరం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన గోడపత్రికను జిల్లా కలెక్టరు చేతుల మీదుగా ఆవిష్కరించారు. జిల్లాలో ఫిబ్రవరి 10న అంగన్వాడి, పాఠశాలలు, కళాశాలల పిల్లలకు ఆల్బెండజోల్ 400 ఎంజి మాత్రలు తప్పనిసరిగా ఇప్పించాలన్నారు.

News February 4, 2025

ఈనెల 6న పీడీఎస్ బియ్యం వేలం..

image

జిల్లాలో నిల్వ ఉన్న 48.330 మెట్రిక్ టన్నుల పీడీఎస్ రైస్‌ను ఈనెల 6న బహిరంగ వేలం వేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. 6ఎ కేసుల్లో సీజ్ చేసిన ప్రజా పంపిణీ బియ్యాన్ని  ఉండి యం.యల్.యస్ పాయింట్‌లో నిల్వ ఉంచామన్నారు. విచారణ అనంతరం 6ఎ కేసులు ముగియడంతో సీజ్ చేసిన బియ్యాన్ని కేజీ రూ.20 ధర నిర్ణయించి వేలం వేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు వేలంలో పాల్గొనవచ్చన్నారు.

error: Content is protected !!