News February 28, 2025

మొలకలచెరువు వద్ద మృతదేహం కలకలం.!

image

మొలకలచెరువు సరిహద్దులోని చీకటి మానుపల్లి పేపర్ మిల్లు వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ములకలచెరువు SI నరసింహుడు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సుమారు 45ఏళ్ళ గుర్తుతెలియని వ్యక్తి చనిపోయినట్లుగా గుర్తించారు. ఛాతిపై పి.బాబాజాన్ అనే పచ్చబొట్టు కలిగి, నీలిరంగు షర్ట్ ధరించాడని తనకల్లు పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చినట్లు చెప్పారు.

Similar News

News March 1, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
* మళ్లీ MLAలుగా గెలవాలంటే పనితీరు మారాలి: చంద్రబాబు
* బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం: బొత్స
* రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం: రేవంత్
* ప్రతి నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్క్: శ్రీధర్‌బాబు
* టన్నెల్‌లో గల్లంతైన వారికోసం గాలింపు కొనసాగుతోంది: కలెక్టర్
* CT: సెమీస్ చేరిన ఆస్ట్రేలియా

News March 1, 2025

వరంగల్: తెలంగాణ పిండివంటలను నేర్చుకున్న కేరళ యువత

image

కేరళ రాష్ట్రానికి చెందిన 27 మంది యువతీ యువకులు రంగశాయిపేటలోని హోమ్ ఫుడ్స్ సందర్శించారు. ఈనెల 20వ తేదీ నుండి మార్చ్ 3 వరకు ఐదు రోజుల పాటు ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం జరుగుతుందన్నారు. తెలంగాణ పిండివంటలైన సకినాలు, మురుకులు, గరిజలు, సర్వపిండి మొదలు వంటలను నిర్వాహకులు కేరళ నుంచి వచ్చిన యువతకు నేర్పారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు గురించి వారికి తెలియజేశారు.

News March 1, 2025

గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ శర్మ

image

తొడ కండరాల గాయంతో బాధపడుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ప్రాక్టీస్‌లో ఎలాంటి తడబాటు లేకుండా ఏకంగా 95 మీటర్లకు పైగా సిక్సర్ బాదినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఎల్లుండి మ్యాచ్‌లో హిట్ మ్యాన్ ఆడరనే ప్రచారానికి తెరదించినట్లే కనిపిస్తోంది. న్యూజిలాండ్‌తో మ్యాచుకు రోహిత్ స్థానంలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!