News December 19, 2025
మోడల్ స్కూళ్లలో 5వ తరగతికి ఎంట్రన్స్ పరీక్ష!

TG: మోడల్ స్కూళ్లలో చేరేందుకు ఇప్పటి వరకు 6వ తరగతి నుంచి ఎంట్రన్స్ పరీక్షలుండగా, వాటిని 5వ క్లాస్ నుంచే నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. గురుకులాల్లో 5వ క్లాస్ నుంచే క్లాసులు నడుస్తుండటంతో మోడల్ స్కూళ్లలోనూ ఆ విధానాన్నే అమలు చేయనున్నారు. ఈ మేరకు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే జనవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. ఆలస్యమైతే ఎప్పటిలాగే 6వ తరగతి నుంచి ఎంట్రన్స్ పరీక్ష ఉంటుంది.
Similar News
News December 19, 2025
మరోసారి అట్టుడుకుతున్న బంగ్లా

బంగ్లాదేశ్లో హాదీ <<18610392>>మృతితో<<>> ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే అవామీ లీగ్ పార్టీ కార్యాలయానికి నిప్పంటించగా అర్ధరాత్రి బంగ్లా బగబంధు ముజిబుర్ రెహ్మాన్ ఇంటిని తగలబెట్టారు. అవామీ లీగ్ పార్టీకి చెందిన పలువురు నేతల ఇళ్లను ధ్వంసం చేశారు. తాజా ఘటనలు ఈ ఏడాది మొదట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లను తలపిస్తున్నాయి. అప్పుడు కూడా ముజిబుర్ ఇంటిపై దాడి జరిగింది.
News December 19, 2025
నిన్ను నువ్వు ఉత్తమంగా మార్చుకోవాలంటే?

ఎవరైనా మనల్ని ఆలస్యంగా ఆహ్వానిస్తే తిరస్కరించడం, పిలవని చోటుకు వెళ్లకపోవడం ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. ఎదుటివారు మనల్ని మర్చిపోతే వారిని వదిలేయాలి. మనల్ని వాడుకోవాలని చూస్తే హద్దులు పెట్టుకోవాలి. మోసపోయినప్పుడు క్షమించి ముందుకు సాగాలి. అవమానించిన వారికి విజయంతో జవాబు చెప్పాలి. మన విలువ గుర్తించని వారికి దూరం ఉండాలి. తక్కువ అంచనా వేసేవారికి ఫలితాలతో సమాధానమివ్వాలి. తద్వారా గుర్తింపు లభిస్తుంది.
News December 19, 2025
రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న జగన్: మంత్రి లోకేశ్

AP: టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వాతోపాటు రహేజా ఐటీ పార్క్కు వ్యతిరేకంగా వైసీపీ పిల్స్ దాఖలు చేసిందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా లక్షకు పైగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. యువత భవిష్యత్తు పట్ల జగన్కు ఎందుకింత ద్వేషం అని Xలో ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి అడుగులోనూ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.


