News March 27, 2024

మోత్కూరు ఎంపీడీవో కార్యాలయంపై ఏసీబీ దాడి

image

మోత్కూరు మండలం పొడిచేడు గ్రామ సెక్రటరీ కిరణ్ ఏసీబీ వలలో బుధవారం చిక్కాడు. మోత్కూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేయగా ఇంటి అనుమతి కోసం రూ.3వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇంటి అనుమతి కోసం బాధితుడు ఇదివరకే రూ.5వేలు ఇవ్వగా మళ్లీ అదనంగా డబ్బులు డిమాండ్ చేయడంతో రూ.3వేలు లంచం తీసుకుంటూ దొరికాడు.

Similar News

News July 8, 2025

నల్గొండ: నిరుద్యోగ యువకులకు హౌస్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ

image

నల్గొండ శివారులోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో గ్రామీణ నిరుద్యోగ యువకులకు హౌస్ వైరింగ్ (ఎలక్ట్రీషియన్) లో 31 రోజుల ఉచిత శిక్షణ అందిస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం ఉంటుందన్నారు. 18 నుంచి 45 సం. లోపు ఉన్న వారు అర్హులని అన్నారు. ఆసక్తి గలవారు జూలై 9 లోపు సంస్థ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 7, 2025

నల్గొండలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి..!

image

నల్గొండలో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు వన్ టౌన్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఓ యువకుడు, ఇద్దరు మహిళలని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కలెక్టర్ ఆఫీస్ వెనకాల ఓ ఇంటిని కిరాయికి తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్న వ్యవహారంపై నిఘా పెట్టారు. నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు మెరుపు దాడులు చేసి పట్టుకున్నట్లు సమాచారం.

News July 7, 2025

NLG: సగం అంగన్వాడీ కేంద్రాలకే సొంత భవనాలు!

image

జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు అరకొర సౌకర్యాలతోనే నడుస్తున్నాయి. సగం కేంద్రాలకు సొంత భవనాలు లేవు. కొన్ని చోట్ల మంజూరైనా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. చిన్నారులకు పౌష్టికాహారం, గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్య సేవలు అందించే ఈ కేంద్రాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఇక అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక కొందరు తల్లిదండ్రులు తమ చిన్నారులను ఆయా కేంద్రాలకు పంపించడం లేదు.