News April 10, 2025

మోసపోయిన నెల్లూరు యువతి

image

నెల్లూరుకు చెందిన సాయిజ్యోత్స్న ఇన్‌స్టాలో ఓ లింక్ క్లిక్ చేయడంతో నితేశ్ అనే వ్యక్తి ఆమెకు వాట్సప్‌లో మెసేజ్ చేశాడు. ఆమె చేత ఓ కంపెనీ వస్తువు ఫీడ్‌బ్యాక్ చేయించి రూ.14వేలు అకౌంట్లో వేశాడు. తమ కంపెనీలో డిపాజిట్లు చేస్తే లాభాలు వస్తాయనడంతో ఆమె రూ.2.50లక్షలు డిపాజిట్ చేసింది. ఆ తర్వాత అకౌంట్లో ఎక్కువ డబ్బులు ఉన్నట్లు చూపించడంతో విత్ డ్రా పెట్టగా రాలేదు. మోసపోయానని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News December 19, 2025

నెల్లూరు: స్మార్ట్ ఫోన్.. షార్ప్‌గా ప్రాణాలు తీస్తోంది.!

image

కాలం మారింది. చేతిలో ఫోన్ లేనిదే దిక్కుతోచని స్థితి. చిన్నపిల్లలు, పెద్దలు, విద్యార్థుల వరకు ఇదే పరిస్థితి. ఇదే మాయలో కేటుగాళ్లు అమ్మాయిలపై <<18607181>>పంజా<<>> విసురుతున్నారు. SM వేధికగా ట్రాప్ చేస్తే వేధింపులకు పాల్పడుతున్నారు. జొన్నవాడ ఆలయ ఉద్యోగి హిజ్రాను ట్రాప్ చేసి డబ్బులు తీసుకోవడం, నెల్లూరులో విద్యార్థిని ఆత్మహత్య ఇందుకు నిదర్శనం. ఫోన్లు వాడేటప్పుడు అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

News December 19, 2025

కోవూరు MLAతో ఇన్‌ఛార్జ్ మేయర్ రూప్ కుమార్

image

నెల్లూరు ఇన్‌ఛార్జ్ మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్ బాధ్యతలు తీసుకున్న అనంతరం పలువురు ప్రముఖులను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్‌లో నివాసం ఉంటున్న కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రశాంతి రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నగర అభివృద్ధికి కృషి చేయాలని ఆమె రూప్ కుమార్ యాదవ్‌ను కోరారు.

News December 19, 2025

కోవూరు MLAతో ఇన్‌ఛార్జ్ మేయర్ రూప్ కుమార్

image

నెల్లూరు ఇన్‌ఛార్జ్ మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్ బాధ్యతలు తీసుకున్న అనంతరం పలువురు ప్రముఖులను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్‌లో నివాసం ఉంటున్న కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రశాంతి రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నగర అభివృద్ధికి కృషి చేయాలని ఆమె రూప్ కుమార్ యాదవ్‌ను కోరారు.