News June 20, 2024
యద్దనపూడి: టీడీపీ ఫ్లెక్సీల చించివేత
యద్దనపూడి మండలం వింజనంపాడు అధికార పార్టీ ఫ్లెక్సీలను చించివేసిన ఘటన కలకలం రేపింది. వైసీపీకి చెందిన సీనియర్ నేత సమక్షంలోనే ఆ పార్టీ కార్యకర్త కావాలనే సమీపంలో ఉన్న టీడీపీ ఫ్లెక్సీ చించివేయడంపై ఆగ్రామ టీడీపీ నేతలు యద్దనపూడి పోలీసులను ఆశ్రయించారు. కావాలని వైసీపీ నాయకులు, శ్రేణులు అధికార టీడీపీకి చెందిన ప్లెక్సీలు చించివేయడంపై ఆ గ్రామాల్లో కలకలం రేపుతోందని గ్రామస్థులు పేర్కొన్నారు.
Similar News
News October 4, 2024
ప్రకాశం: ‘బాణసంచా విక్రయాలకు దరఖాస్తు చేసుకోవాలి’
ప్రకాశం జిల్లాలో దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా దుకాణాల ఏర్పాటుకు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత శుక్రవారం తెలియజేశారు. ఆసక్తికలిగిన వారు తాత్కాలిక లైసెన్స్ కోసం ఈనెల 15లోగా మీసేవ కేంద్రాలు, సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తహశీల్దార్లు, పోలీసు అధికారులు వ్యక్తిగతంగా పర్యవేక్షించి దీపావళి బాణసంచాను విక్రయించేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు.
News October 4, 2024
కందుకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
కందుకూరు శివారులోని పామూరు రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పొన్నలూరు మండలం ముప్పాళ్ళ నుంచి నెల్లూరు జిల్లా ASపేట దర్గాకు ప్రయాణికులతో బయలుదేరిన ఆటోను, ఎదురుగా పొగాకు చెక్కులతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ళ బాలుడు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కందుకూరు ఏరియా హాస్పిటల్కు తరలించారు.
News October 4, 2024
ప్రకాశం: అక్టోబర్ 13 వరకు దసరా సెలవులు
ప్రకాశం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈనెల 13వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి సుభద్ర తెలిపారు. ఈ నెల 14న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయన్నారు. అలా కాకుండా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో హెచ్చరించారు.