News September 22, 2025
యధావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

రాజమండ్రి కలెక్టరేట్లో సోమవారం PGRS కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను అందజేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి అవగాహన కలిగి ఉండాలని కూడా సూచించారు.
Similar News
News September 28, 2025
గుర్రం జాషువాకు మంత్రి కందుల నివాళి

సమసమాజ నిర్మాణ స్ఫూర్తి ప్రదాత మహాకవి గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరం వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేశ్ హాజరై, జాషువా చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. తెలుగు సాహితీ లోకంలో ఆయన చిరస్మరణీయుడని మంత్రి దుర్గేశ్ కొనియాడారు.
News September 28, 2025
గోపాలపురంలో రాబరీ గ్యాంగ్.. జాగ్రత్త

మధ్యప్రదేశ్, రాజస్థాన్కు చెందిన ఆరుగురు సభ్యుల రాబరీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు సమాచారం ఉందని గోపాలపురం ఎస్.ఐ. మనోహర్ తెలిపారు. ఈ గ్యాంగ్ పత్తిపాడు, నల్లజర్లలో బంగారం దొంగతనాలతో పాటు అనేక పెద్ద దొంగతనాలకు పాల్పడిందని చెప్పారు. వారు లాడ్జ్లు, ధాబాలలో తలదాచుకుంటూ, మరెక్కడైనా నేరానికి పాల్పడే అవకాశం ఉందని ఎస్.ఐ. హెచ్చరించారు. ఆ గ్యాంగ్ సభ్యులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
News September 28, 2025
5 రోజులు భారీ వర్షాలు: కలెక్టర్ కీర్తి చేకూరి

గోదావరి వరదల కారణంగా తూ.గో జిల్లాలో రానున్న 5 రోజులు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆదివారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి శాఖ సమన్వయంతో, వేగంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించి, అవసరమైన చోట సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.