News February 18, 2025
యర్రగొండపాలెం తహశీల్దార్పై సస్పెన్షన్ వేటు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739869773346_1271-normal-WIFI.webp)
యర్రగొండపాలెం తహశీల్దార్పై సస్పెన్షన్ వేటు పడింది. రూ.5 కోట్ల విలువైన స్థలం విషయంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై తహశీల్దార్ బాల కిషోర్ను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో భాగస్వాములైన వీఆర్వో యల్లయ్య, సర్వేయర్ దిలీప్లను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని యర్రగొండపాలెం ఇన్ఛార్జ్ తహశీల్దార్ నలగాటి మల్లికార్జున మంగళవారం తెలిపారు.
Similar News
News February 20, 2025
ప్రకాశం జిల్లా టాప్ న్యూస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1740067869349_20611727-normal-WIFI.webp)
* మర్రిపూడిలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ * వరల్డ్ ఛాంపియన్గా ప్రకాశం జిల్లా వ్యక్తి* ప్రకాశం జిల్లాలో బర్డ్ ప్లూ లేదు* రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్* వన్య ప్రాణుల ప్రాణాలకు విలువ లేదా?: ఎమ్మెల్యే తాటిపర్తి* 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి: డీఆర్వో * వారబందీ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్
News February 20, 2025
దోర్నాల: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739985961257_60457281-normal-WIFI.webp)
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దోర్నాల గుండా శ్రీశైలం వెళ్లే భక్తులను అటవీశాఖ అధికారులు 24 గంటలు అనుమతించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రకాశం జిల్లా డీఎఫ్వో మాట్లాడుతూ.. 24 గంటల అనుమతి అని అసత్య ప్రచారం సాగుతుందని, భక్తులకు ఈ మార్గంలో రాత్రి 9 గంటల వరకే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
News February 20, 2025
వారబందీ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739973321797_20611727-normal-WIFI.webp)
వారబంది విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అన్సారియా తెలిపారు. కలెక్టర్ ఇరిగేషన్ అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన జిల్లా సరిహద్దు 85/3 మైలు వద్ద నుంచి వస్తున్న నాగార్జునసాగర్ నీటిని నిరంతరం గమనిస్తూ ఉండాలన్నారు. వస్తున్న నీటిని పరిగణలోకి తీసుకొని జిల్లాలో నీటి అవసరం ఉన్న ప్రాంతాలకు మళ్లించాలని తెలిపారు.