News February 12, 2025
యలమంచిలి : కళాశాల హాస్టల్లో విద్యార్థి సూసైడ్

ప.గో జిల్లా యలమంచిలికి చెందిన రావూరి సాయిరాం (22) కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల హాస్టల్లో సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని స్వగ్రామం బాడవకు తీసుకొచ్చారు. అయితే అతని మృతికి కారణాలు తెలియలేదని కాకినాడ పోలీసులు తెలిపారు. మరి కొద్ది రోజుల్లో ప్రాక్టికల్స్ ఉండడంతో ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడా.. వేరే కారణాలు ఉన్నాయా ? అనే కోణంలో కాకినాడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 21, 2025
జపాన్ ప్రధానిగా సనాయి తకాయిచి ఎన్నిక

జపాన్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. తొలి మహిళా ప్రధానిగా లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ నేత సనాయి తకాయిచి ఎన్నికయ్యారు. పార్లమెంట్ లోయర్ హౌస్లో జరిగిన ఎన్నికలో మొత్తం 465 ఓట్లకుగానూ ఆమె 237 ఓట్లు సాధించారు. ఇక అప్పర్ హౌస్లోనూ తకాయిచి ఎన్నిక లాంఛనమే కానుంది. కాగా ఐరన్ లేడీ ఆఫ్ జపాన్’గా గుర్తింపు పొందారు.
News October 21, 2025
నాగర్ కర్నూల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో అచ్చంపేటలో అత్యధికంగా 32.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు మంగళవారం ప్రకటించారు. పెద్దకొత్తపల్లిలో 31.9, తెలకపల్లిలో 31.8, కల్వకుర్తిలో 31.7, కొల్లాపూర్లో 31.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వారు పేర్కొన్నారు.
News October 21, 2025
కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం: రేవంత్

TG: నిజామాబాద్లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి CM రేవంత్ రూ.కోటి పరిహారం ప్రకటించారు. HYDలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ప్రసంగించారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారం ప్రకటించారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు.