News October 4, 2024
యలమంచిలి: రూ.100 కోసం బ్లేడ్తో దాడి
అప్పుగా ఇచ్చిన రూ.100 కోసం ఓ వ్యక్తిపై పదునైన బ్లేడ్తో దాడి చేశాడు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం కొత్తలిలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన నూకిరెడ్డి శ్రీనివాస్ అదే గ్రామానికి చెందిన బంగారి వెంకటరమణకు రూ.100 అప్పుగా ఇచ్చాడు. డబ్బు ఇవ్వాలని అడగ్గా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత రామాలయం వద్ద కూర్చున్న శ్రీనివాస్పై వెంకటరమణ బ్లేడ్తో దాడి చేశాడు.
Similar News
News October 4, 2024
విశాఖ స్టీల్ప్లాంట్పై వైఎస్ షర్మిల కీలక ప్రకటన
విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించి బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో త్వరలో సీఎంను కలుస్తామన్నారు. రాహుల్ గాంధీని విమర్శించే అర్హత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లేదన్నారు.
.
News October 4, 2024
విశాఖలో రెండో రోజు టెట్ పరీక్షకు 1662 మంది హాజరు
జిల్లాలో నిర్వహిస్తున్న టెట్ పరీక్షకు రెండో రోజు శుక్రవారం 1662 మంది హాజరైనట్లు డీఈవో చంద్రకళ వెల్లడించారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండో రోజు 1852 మంది విద్యార్థుల పరీక్ష రాయాల్సి ఉందన్నారు. తాను ఒక పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేయగా ఫ్లయింగ్ స్క్వేర్ మూడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిందని వివరించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అవి వెల్లడించారు.
News October 4, 2024
మిస్సెస్ ఇండియా-2024గా విశాఖ మహిళ
మలేషియాలో జరిగిన గ్లామ్ ఆన్ మిస్సెస్ ఇండియా-2024 విజేతగా విశాఖకు చెందిన హేమలతా రెడ్డి నిలిచారు. 300 మంది పాల్గొన్న ఈ పోటీల్లో విజేతగా నిలిచి విశాఖ ఖ్యాతిని పెంచారు. ఆమె ఇంతకముందు యాంకర్గా పనిచేశారు. త్వరలో పారిస్ ఫ్యాషన్ వీక్కి కూడా వెళ్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హేమలతా రెడ్డిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, పలువురు పాత్రికేయులు సత్కరించారు.