News February 14, 2025
యలమంచిలి : లారీ ఢీకొని మహిళ మృతి

లారీ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన యలమంచిలి ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం.. తాడిగరువుతోటకు చెందిన విజయ నడుచుకుని వెళ్తుండగా.. కొబ్బరిలోడు లారీ ఆమెను ఢీకొంది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె ముగ్గురు కుమార్తెలకు వివాహమైంది. భర్త ఇటీవల మృతి చెందినట్లు సమాచారం.
Similar News
News September 14, 2025
రాజమండ్రి: లోక్ అదాలత్లో 4,733 కేసులు పరిష్కారం

రాజమండ్రిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 4,733 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా ఇన్ఛార్జ్ జడ్జి మాధురి ఈ వివరాలను వెల్లడించారు. ఈ కేసుల ద్వారా బాధితులకు రూ.16.35 కోట్లకు పైగా పరిహారం అందనుంది. పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్లు ఎంతో ఉపయోగపడతాయని ఆమె తెలిపారు.
News September 14, 2025
శ్రీకాకుళం జిల్లాకు భారీ వర్ష సూచన

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రానున్న మూడు రోజులు శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంద్ర జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు సముద్రం మీద వేటకు వెళ్లవద్దని సూచించారు. అల్ప పీడన ప్రభావం వలన సముద్రంలో రాకాసి అలలు ఎగసి పడతాయని హెచ్చరించారు.
News September 14, 2025
మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సింగరేణి సంస్థ

సింగరేణి సంస్థ మహిళా సాధికారత దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. సీఎండీ బలరామ్ ఆదేశాల మేరకు ఇకపై ఓసీలో మహిళా ఆపరేటర్లు, జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలు ఓసీల్లో యంత్రాలను నడిపే ఆపరేటర్లుగా పనిచేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది.