News February 14, 2025

యలమంచిలి : లారీ ఢీకొని మహిళ మృతి

image

లారీ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన యలమంచిలి ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం.. తాడిగరువుతోటకు చెందిన విజయ నడుచుకుని వెళ్తుండగా.. కొబ్బరిలోడు లారీ ఆమెను ఢీకొంది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె ముగ్గురు కుమార్తెలకు వివాహమైంది. భర్త ఇటీవల మృతి చెందినట్లు సమాచారం.

Similar News

News November 2, 2025

లంబసింగిలో పర్యాటకుల సందడి

image

చింతపల్లి మండలంలోని ఆంధ్ర కశ్మీర్‌గా పేరొందిన ప్రముఖ పర్యాటక కేంద్రమైన లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. వింటర్ సీజన్ ప్రారంభం కావడంతో పాటు వీకెండ్ కావడంతో పర్యాటకులు లంబసింగి ప్రాంతంలో సందడి చేశారు. మంచు, చెరువులవేనం వ్యూ పాయింట్ వద్ద మంచు మేఘాల అందాలను తనివితీరా ఆస్వాదించారు. మరికొందరు తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు.

News November 2, 2025

వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా.!

image

వరంగల్ జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ KG రూ.200- రూ.220 మధ్య ధర పలుకుతోంది. స్కిన్‌ లెస్ కేజీ రూ.230- రూ.250 ధర పలుకుతోంది. లైవ్ కోడి కేజీ రూ.160-రూ.170 మధ్య ఉంది. సిటీతో పోలిస్తే పల్లెల్లో ధర రూ.10-రూ.20 వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం కార్తీక మాసం నేపథ్యంలో అమ్మకాలు స్వల్పంగా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

News November 2, 2025

మ‌ణికొండలో రూ.300 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

image

HYD మ‌ణికొండ‌లో రూ.300 కోట్ల విలువైన ప్ర‌భుత్వ భూమి, పార్కు స్థలాల‌ను క‌బ్జాదారుల నుంచి హైడ్రా విముక్తి చేసింది. ప‌శ్చిమ ప్లాజా స‌మీపంలో ఎలాంటి ప‌త్రాలు లేని ఎక‌రం ప్ర‌భుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, క‌బ్జాదారుల‌ను ఖాళీ చేయించింది. వెంకటేశ్వర కాలనీ, తిరుమల హిల్స్‌లోని మొత్తం 7,650 గజాల రెండు పార్కు స్థలాలను కూడా హైడ్రా తిరిగి తీసుకుంది. ఈ స్థలాల్లో హైడ్రా బోర్డులు, ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసింది.