News February 16, 2025

యలమంచిలి: 45 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టివేత

image

యలమంచిలి మండలంలో చించినాడ హైవే వద్ద శనివారం నరసాపురం నుంచి తూర్పుగోదావరి జిల్లాకి మినీ లారీలో తరలిస్తున్న 45 క్వింటాళ్ల పీడీఎస్ రైసును విజిలెన్స్ సీఐ డి. ప్రసాద్ కుమార్ పట్టుకున్నారు. మినీ లారీని, బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. యలమంచిలి సివిల్ సప్లై డీటీ అయితం సత్యనారాయణ ఉన్నారు.

Similar News

News July 5, 2025

పారిశుద్ధ్యం పనులపై జేసీ అసహనం

image

భీమవరం పట్టణంలో చెత్త నిర్మూలనకు ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో పారిశుద్ధ్యానికి తీసుకోవలసిన చర్యలపై భీమవరం ఆర్డీవో మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. పారిశుద్ధ్యం మెరుగుదలకు ఎన్ని చర్యలు చేపట్టినా నామ్ కే వాస్తే అనే చందంగా ఉందని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.

News July 4, 2025

మొగల్తూరు: కారు ఢీకొని రైతు మృతి

image

పేరుపాలెం నార్త్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు గుత్తుల పెద్దిరాజు మృతి చెందారు. పేరుపాలెం బీచ్ నుంచి భీమవరం వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపంలో అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ పక్కనే పచ్చగడ్డి కోస్తున్న పెద్దిరాజును కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న వారికి ఏమి కాలేదు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

News July 4, 2025

తణుకులో అత్యధిక వర్షపాతం నమోదు

image

గడచిన 24 గంటల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 34.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా తణుకు మండలంలో 12.2, ఆచంట 5.2, పెంటపాడు 4.2, పోడూరు 3.6 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. యలమంచిలి, పాలకొల్లు, నరసాపురం, మొగల్తూరు, కాళ్ల, భీమవరం, వీరవాసరం మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని వెల్లడించారు.