News February 24, 2025

యాగంటి క్షేత్రానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

image

మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బనగానపల్లె మండలంలోని యాగంటి క్షేత్రానికి వెళ్లే భక్తులకు దేవస్థానం వారు సోమవారం శుభవార్త చెప్పారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 25 నుంచి 27వ తేదీ వరకు టోల్గేట్ రుసుము మినహాయింపు ఇస్తున్నట్లు దేవస్థానం ఈవో చంద్రుడు తెలిపారు. అలాగే విచ్చేయు భక్తులకు ఒక లడ్డు ప్రసాదం ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

Similar News

News February 24, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి అభ్యర్థులు వీరేనా?

image

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూటమి తరఫున భారీగా ఆశావహులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐదు ఖాళీలకుగానూ టీడీపీ నుంచి కేఎస్ జవహర్, వంగవీటి రాధా, ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి మాధవ్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి 3న నోటిఫికేషన్ రానుండగా 20న ఎన్నికలు జరగనున్నాయి.

News February 24, 2025

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు: చంద్రబాబు

image

AP: భవిష్యత్‌లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ‘ప్రభుత్వ కార్యాలయాలు, రైతు బజార్లలో క్యూఆర్ కోడ్ ఉంచాలి. అన్ని కలెక్టరేట్లలో వాట్సాప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి. నిత్యావసర సరుకుల ధరలు ఎప్పటికప్పుడు సమీక్షించాలి. బెల్టు షాపులు ఎక్కడ ఉన్నా ఉపేక్షించొద్దు’ అని ఆయన పేర్కొన్నారు.

News February 24, 2025

నల్గొండ జిల్లా టాప్ న్యూస్

image

☞ ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రులు ☞ మున్నూరు కాపులు కూడా రెడ్లే: విశారదన్ మహరాజ్ ☞  NLG కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే ☞ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన ☞ జోరుగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ☞ మహాశివరాత్రికి ముస్తాబవుతున్న శివాలయాలు ☞ యుజీసీ నెట్ సాధించిన ఎంజీయూ విద్యార్థులు

error: Content is protected !!