News February 16, 2025

యాగం చేసిన అనకాపల్లి ఎంపీ 

image

లోక కల్యాణార్థం సుదర్శన లక్ష్మీనరసింహ, లక్ష్మీ గణపతి, మృత్యుంజయ యాగం, మహా శాంతి హోమం నిర్వహించినట్లు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో కుటుంబ సమేతంగా వీటిని నిర్వహించామన్నారు. కేంద్రం, రాష్ట్రంలోనూ ప్రజా సంక్షేమ ప్రభుత్వాలు వర్ధిల్లాలని.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే శక్తిని ప్రసాదించాలని కోరుతూ ఈ యాగం చేశామన్నారు.

Similar News

News February 27, 2026

అధిక యూరియాతో పంటకు కలిగే నష్టాలు

image

చాలా మంది రైతులు ఎక్కువ దిగుబడి వస్తుందని పంటకు అధికంగా యూరియా వేస్తున్నారు. సిఫార్సుకు మించి వేసిన యూరియా ఒకేసారి నీటిలో కరిగిపోతుంది. 2-3 రోజుల్లో పంట కొంత వరకు మాత్రమే తీసుకోగలుగుతుంది. మిగిలింది వృథాగా భూమి లోపలి పొరల్లోకి, ఆవిరి రూపంలో గాలిలో కలిసిపోతుంది. దీని వల్ల ఎరువు నష్టంతో పాటు పంటను ఎక్కువగా పురుగులు, తెగుళ్లు ఆశించి బలహీన పరుస్తాయి. కాబట్టి నిపుణుల సిఫార్సు మేరకే యూరియా వేసుకోవాలి.

News February 27, 2026

రాష్ట్రంలో 43 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

తెలంగాణ హైకోర్టులో 43 పోస్టులకు( ఆఫీస్ సబార్డినేట్ 34, డ్రైవర్ 9) అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఏడో తరగతి, టెన్త్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగినవారు అర్హులు. వయసు 18 నుంచి 46ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్ , వైవా వోస్, ఓరల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://tshc.gov.in

News February 27, 2026

తుని: ఐదేళ్లు.. ముగ్గురు మహిళలు

image

తుని మున్సిపాలిటీ ఐదేళ్ల పాలనలో ముగ్గురు ఛైర్ పర్సన్లు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఛైర్ పర్సన్‌గా ఉన్న నార్ల భువన సుందరి పదవీకాలం మార్చి 17తో ముగియనుంది. 2021లో YCP నుంచి ఏలూరి సుధారాణి బాధ్యతలు చేపట్టగా, 2025లో రాజీనామా చేశారు. అనంతరం కుచ్చర్లపాటి రూపాదేవి ఆ బాధ్యతలు చేపట్టారు. తదుపరి భువన సుందరి చైర్ పర్సన్‌గా ఎంపికై పదవీకాలాన్ని పూర్తి చేస్తున్నారు.