News December 23, 2025

యాదగిరిగుట్ట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

image

యాదగిరిగుట్ట మండలం దాతర్‌పల్లి, రాళ్ల జనగాం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు పరిశీలించారు. నిర్మాణ పనులు మొదలుపెట్టి ఎన్ని రోజులు అవుతుందని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు పూర్తయిన వరకు బిల్లులు వచ్చాయా అని అడిగారు. మిగిలిన పనులు కూడా త్వరగా పూర్తి చేస్తే బిల్లు పడుతుందని, అనంతరం గృహప్రవేశం కూడా త్వరగా చేసుకోవాలని సూచించారు.

Similar News

News December 24, 2025

ADB: 27న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ ఎంపికలు

image

ఈ నెల 27న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు అండర్-16,18, 20 బాల బాలికలకు, మెన్ అండ్ ఉమెన్స్‌కి వేరువేరుగా ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అధ్యక్షుడు బోజా రెడ్డి తెలిపారు. ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసి జనవరి 2న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. అర్హులైన, ఆసక్తిగల క్రీడాకారులు పాల్గొనాలని కోరారు.

News December 24, 2025

జిల్లాకు తలమానికం ‘జలజీవన్ మిషన్’: కలెక్టర్

image

జిల్లాలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా జలజీవన్ మిషన్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో జలవనరుల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రూ.1,650 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును మంజూరు చేసిందని, ఇది జిల్లా అభివృద్ధికి తలమానికమని పేర్కొన్నారు. పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

News December 24, 2025

తిరుమలకు ఫేక్ టికెట్లతో వస్తున్నారా..?

image

తిరుమల వైకుంఠ ద్వారా దర్శనాల నేపథ్యంలో SP సుబ్బరాయుడు కీలక ప్రకటన చేశారు. ‘డిసెంబర్ 30, 31, జనవరి 1న లక్కీడిప్ టోకెన్లు ఉన్నవారినే దర్శనానికి అనుమతిస్తాం. అన్ని టోకెన్లను స్కాన్ చేసి అందులోని టైం ప్రకారమే పంపుతాం. నకిలీ టోకెన్లు సృష్టించిన వారిపై, అవి నకిలీ అని తెలిసి కూడా తిరుమలకు తెచ్చిన వారినైనా కేసులు పెడతాం. ఆటో, జీపు డ్రైవర్లు భక్తులను మిస్ గైడ్ చేస్తే చర్యలు ఉంటాయి’ అని SP హెచ్చరించారు.