News February 12, 2025
యాదగిరిగుట్ట: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

యాదగిరిగుట్ట మండలం గోధుమకుంట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల ప్రకారం.. HYDకు చెందిన ఎండీ అస్లం(27), ఎండీ ఇబ్రహీం సోహెల్తో కలిసి బైక్పై వరంగల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు బైక్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అస్లం స్పాట్లోనే చనిపోగా.. సోహెల్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడి తండ్రి ఎండీ సలీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Similar News
News December 18, 2025
కామారెడ్డి: ఆ మండలంలో స్వతంత్ర సర్పంచులు ఎక్కువ

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలంలో ఏకంగా 18 మంది సర్పంచ్లు స్వతంత్రులు కావడం విశేషం. మండలంలో 31 గ్రామాల్లో సర్పంచ్ స్థానాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుతో బరిలో దిగిన అభ్యర్థులను కాదని ఓటర్లు స్వతంత్రుల వైపు మొగ్గు చూపారు. అధికార కాంగ్రెస్(9), ప్రతిపక్ష బీఆర్ఎస్(4) సాధించుకున్న సీట్ల మొత్తాన్ని కలుపుకున్నా స్వతంత్రులే అధికంగా ఉండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
News December 18, 2025
ఆరోగ్యం, ఐశ్వర్యం తిరిగి పొందేందుకు..

అశాంతి, అనారోగ్యం, ఐశ్వర్య నష్టం మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే పరమేశ్వరుడిని ప్రసన్నం చేసే రుద్రహోమం మీకు సరైనది. ఇందులో శ్రీరుద్రం, శివ పంచాక్షరి వంటి మంత్రోచ్ఛారణలతో పాటు పరమేశ్వరుడికి ప్రీతికరమైన ఆహుతులను పూజారులు అగ్నికి సమర్పిస్తారు. దీంతో అనారోగ్యం, నెగెటివ్ ఎనర్జీ దూరమై శివుడి అనుగ్రహంతో అర్థ, అంగ బలం పొందుతారు. అందుబాటు ఛార్జీల్లో పూజ, వివరాల కోసం <
News December 18, 2025
అమెజాన్లో మరోసారి ఉద్యోగాల కోత

అమెజాన్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. లక్సెంబర్గ్లోని యూరోపియన్ హెడ్క్వార్టర్స్లో 370 జాబ్స్కు కోత పెట్టనుంది. అక్కడ ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం కంపెనీ చరిత్రలో తొలిసారి. AI వినియోగంపై దృష్టిపెట్టిన అమెజాన్ 14 వేలకు పైగా ఉద్యోగులను తొలగిస్తామని అక్టోబర్లో ప్రకటించింది. లక్సెంబర్గ్లో తొలుత 470 మందిని తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. అయితే స్టాఫ్తో చర్చల తర్వాత ఆ సంఖ్యను తగ్గించింది.


