News February 12, 2025
యాదగిరిగుట్ట: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

యాదగిరిగుట్ట మండలం గోధుమకుంట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల ప్రకారం.. HYDకు చెందిన ఎండీ అస్లం(27), ఎండీ ఇబ్రహీం సోహెల్తో కలిసి బైక్పై వరంగల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు బైక్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అస్లం స్పాట్లోనే చనిపోగా.. సోహెల్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడి తండ్రి ఎండీ సలీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Similar News
News February 27, 2026
అఫ్గాన్తో పాకిస్థాన్ ‘ఓపెన్ వార్’

అఫ్గాన్తో ‘ఓపెన్ వార్’ <<19249710>>చేస్తున్నామని<<>> పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. ‘ఆపరేషన్ గజబ్’ కొనసాగుతోందన్నారు. అఫ్గాన్తో యుద్ధం నేపథ్యంలో మిత్రపక్షాల మద్దతు కూడగట్టేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. సౌదీ అరేబియా మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్తో పాక్ మంత్రి ఇషాక్ ఫోన్లో మాట్లాడారు. మరోవైపు తాము పాక్ F-16 ఫైటర్ జెట్ కూల్చివేశామని తాలిబన్లు ప్రకటించారు. కానీ ఇది పాత వీడియో అని వార్తలొస్తున్నాయి.
News February 27, 2026
మేడ్చల్: వృద్ధుడికి సెంచరీ సెలబ్రేషన్స్.. అంతలోపే

ఆయనకు నిండునూరేళ్లు నిండాయి. గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేద్దామని కుటుంబం ఏర్పాట్లు చేసుకుంది. అంతలోనే ఆ వృద్ధుడు మృతిచెందారు. బీదర్కు చెందిన దొండచార్య జోషి(100) బోడుప్పల్ గాయత్రినగర్లో స్థిరపడ్డారు. బీదర్ HYD సంస్థానంలో ఉన్న సమయంలో రజాకార్ల దౌర్జన్యంపై ఈయన దండెత్తారు. KA, MH రాష్ట్రాల విభజనలో పాల్గొన్నారు. గతేడాది బోడుప్పల్లో అఖిల బ్రాహ్మణ వికాస సమితీ ఆధ్వర్యంలో 99వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
News February 27, 2026
పటాన్చెరు: UKలో ఉన్న అన్నకు మెసేజ్.. MISSING

పటాన్చెరు ఇస్నాపూర్ మున్సిపల్ పరిధికి చెందిన నాగఅక్షయ లక్ష్మి (బీఏ ఫైనల్ ఇయర్), రుద్రారం గీతం యూనివర్సిటీలో చదువుతోంది. గురువారం ఉదయం కళాశాలకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. తాను బయటకు వెళ్తున్నానని, పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని యూకేలో ఉన్న సోదరుడికి వాట్సాప్ వాయిస్ మెసేజ్ పంపింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


