News December 13, 2025
యాదగిరిగుట్ట: డిసెంబర్ 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ఒక మాసంపాటు ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి ఎస్.వెంకట్రావు తెలిపారు. ధనుర్మాస ఉత్సవ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 4.30 నుంచి ఉదయం 5 గంటల వరకు శ్రీ స్వామివారి ఆలయ ముఖమండపంపై ఉత్తర భాగాంలోని హాలులో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
Similar News
News December 14, 2025
@9AM.. పోలింగ్ శాతం ఎంతంటే?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.
★ వరంగల్: 18.82%
★ హనుమకొండ: 19.57%
★ ములుగు: 18.85%
★ భూపాలపల్లి: 26 40%
★ జనగాం: 16.82%
★ మహబూబాబాద్: 23.30%
➤ మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరుగుతుంది. మ.2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.
News December 14, 2025
మంచిర్యాల జిల్లాలో 21.52% పోలింగ్

మంచిర్యాల జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 21.52% ఓటింగ్ నమోదైంది. బెల్లంపల్లిలో 22.81శాతం, భీమిని 21.39, కన్నెపల్లి 23.33 శాతం, కాసీపేట్ 19.45, నెన్నెల్ 18.46, తాండూర్ 22.07, వేమనపల్లి 24.22 ఓటింగ్ నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.
*జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.
News December 14, 2025
ISIS దాడిలో ముగ్గురు అమెరికన్ల మృతి.. ట్రంప్ వార్నింగ్

సెంట్రల్ సిరియాలో ఐసిస్ చేసిన దాడిలో ముగ్గురు అమెరికన్లు చనిపోయారు. వీరిలో ఇద్దరు సైనికులు, ఓ పౌరుడు ఉన్నారు. ఈ ఘటనపై US అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇది అమెరికా, సిరియాపై జరిగిన దాడి అని, బలమైన ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. ఈ దాడితో దిగ్భ్రాంతికి గురైనట్లు సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా చెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు.


