News March 21, 2025
యాదగిరి శ్రీవారి నిత్యా ఆదాయ వివరాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. గురువారం 1,532 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.52,500, ప్రసాద విక్రయాలు రూ.7,87,840, VIP దర్శనాలు రూ.1,20,000, బ్రేక్ దర్శనాలు రూ.1,50,000, కార్ పార్కింగ్ రూ.2,24,000, వ్రతాలు రూ.69,600, యాదరుషి నిలయం రూ.42,000, లీజెస్ రూ.6,71,986 తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.23,46,131 ఆదాయం వచ్చింది.
Similar News
News December 14, 2025
వరంగల్ జిల్లాలో ప్రారంభమైన రెండో విడత పోలింగ్

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీల్లో రెండో విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరుగనుంది. 2 గంటల నుంచి వార్డు సభ్యుల ఓట్లను 25 చొప్పున బండిళ్లు కట్టిన అనంతరం లెక్కిస్తారు. సర్పంచ్ ఫలితాలు సాయంత్రం 4 గంటల నుంచి వెలువడనున్నాయి. 6 జిల్లాల్లోని 508 జీపీలకు 1686 మంది సర్పంచ్ అభ్యర్థులు, 4020 వార్డుల్లో 9884 మంది పోటీ పడుతున్నారు.
News December 14, 2025
‘లంపి స్కిన్’తో పాడి పశువులకు ప్రాణ హాని

పాడి పశువులకు సోకే ప్రమాదకర వ్యాధుల్లో లంపి స్కిన్(ముద్ద చర్మం) ఒకటి. ఇది వైరస్ వల్ల వచ్చే అంటు వ్యాధి. గతంలో ఈ వ్యాధి సోకి అనేక రాష్ట్రాల్లో పశువులు మృతి చెందాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పశువులకు ఇది సోకుతుంది. దీని వల్ల అవి బలహీనంగా మారి పాల దిగుబడి బాగా తగ్గిపోతుంది. ఈ వ్యాధి తీవ్రమైతే పశువుల ప్రాణాలు పోతాయి. ఈ వ్యాధి లక్షణాలు, నివారణ మందు తయారీ సూచనలకు <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 14, 2025
తూ.గో: కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడిగా మారితే.. ఆడపిల్లల భద్రతకు దిక్కెవరు? ఉప్పలగుప్తం మండలంలో 15 ఏళ్ల కుమార్తెపై <<18555090>>కన్నతండ్రే అత్యాచారానికి<<>> పాల్పడటం సభ్యసమాజాన్ని విస్మయానికి గురిచేసింది. రక్షకుడే రాక్షసుడైన ఈ ఉదంతం పవిత్ర బంధానికి మాయని మచ్చలా మారింది. అల్లారుముద్దుగా సాకాల్సిన వాడే చిదిమేస్తుంటే.. సమాజం ఎటుపోతోందన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది.


