News March 28, 2025

యాదగిరి శ్రీవారి నిత్యా ఆదాయ వివరాలు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. గురువారం 1,400 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.70,000, ప్రసాద విక్రయాలు రూ.8,23,400, VIP దర్శనాలు రూ.1,35,000, బ్రేక్ దర్శనాలు రూ.96,600, కార్ పార్కింగ్ రూ.1,97,000, వ్రతాలు రూ.77,600, యాదరుషి నిలయం రూ.52,172, లీజేస్ రూ.22,92,572, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.39,62,875 ఆదాయం వచ్చింది.

Similar News

News November 6, 2025

గన్నవరం: ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

image

ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల నుంచి ఎంపికైన 52 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తొలిసారి విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. దీంతో చిన్నారులు భావోద్వేగానికి లోనయ్యారు. సమగ్ర శిక్షా, ఏపీ సైన్స్ సిటీ సంయుక్తంగా చేపట్టిన మూడు రోజుల సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో భాగంగా జాతీయ మ్యూజియం, ప్లానెటోరియం సందర్శిస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో అభినందించారు.

News November 6, 2025

అమలాపురం: 8న డీఆర్‌సీ సమావేశం

image

జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్‌సీ) సమావేశం అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్‌లో శనివారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ గురువారం తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్న నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని వెల్లడించారు. అన్ని శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు తమ శాఖలకు సంబంధించిన సమాచారంతో సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆదేశించారు.

News November 6, 2025

KGF నటుడు కన్నుమూత

image

కేజీఎఫ్ నటుడు <<17572420>>హరీశ్ రాయ్<<>> కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. KGF-1లో హరీశ్ రాయ్.. ఛాఛా అనే పాత్రలో నటించారు. రెండో పార్ట్ రిలీజైన నాటికే ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అది నాలుగో స్టేజీకి చేరడంతో పూర్తిగా బక్కచిక్కిపోయారు. ఆర్థిక సాయం చేయాలని కోరగా నటుడు ధ్రువ్ సర్జా హెల్ప్ చేశారు. పరిస్థితి చేజారిపోవడంతో ఆయన మరణించారు.