News March 19, 2025
యాదాద్రి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనుల పక్రియ పూర్తి చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల నిర్మాణాల పనుల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. మంగళవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీవోలతో ఇందిరమ్మ ఇళ్లకు, తాగు నీరు, పన్ను వసూళ్లు, ఎల్అర్ఎస్లపై అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలసి మండలాల వారిగా సమీక్షించారు.
Similar News
News March 19, 2025
సూర్యాపేట: ప్రజలు వెయిటింగ్.. బడ్జెట్ ఓకేనా!

అసెంబ్లీలో ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా దానిపై జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. సూర్యాపేటలో ఆటోనగర్లో IT కారిడార్ ఏర్పాటు, SRSP కాల్వలకు నిధులు, MG యూనివర్సిటీకి ఫండ్స్, తుంగతుర్తిలో డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాలను ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి కీలక శాఖలకు ఇద్దరు మంత్రులుగా ఉండడంతో బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News March 19, 2025
భద్రాద్రి: మైనర్పై అత్యాచారం..యువకుడిపై పోక్సో కేసు

భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలోని ఓ గ్రామంలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో యువకుడి(24)పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు సోమవారం రాత్రి ఊరు చివరికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడగా, విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ఫిర్యాదు మేరకు, యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు.
News March 19, 2025
గుంటూరు: వీఆర్కు పట్టాభిపురం సీఐ మదుసూదనరావు!

పట్టాభిపురం సీఐ వీరేంద్ర స్థానంలో నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన మదుసూదనరావుకు ఉన్నతాధికారులు ఝలక్ ఇచ్చారు. ఆదివారం రాత్రి ఈయన బాధ్యతలు చేపట్టగా తాజాగా వీఆర్కు పంపారు. ఓ ప్రజాప్రతినిధి సిఫార్సుతో ఈయనకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే స్థానిక నేతల నుంచి వ్యతిరేకత రావడంతో వీఆర్కు పంపినట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. కాగా కేవలం 9 నెలల వ్యవధిలో ఈ స్టేషన్కు ముగ్గురు CIలు మారడం గమనార్హం.