News March 29, 2024

యాదాద్రి: ఉరి వేసుకుని యువకుడి సూసైడ్ 

image

వ్యక్తిగత కారణాలతో ఓ యువకుడు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన బీబీనగర్లో చోటుచేసుకుంది. పోచంపల్లి మండలం పిల్లాయిపల్లికి చెందిన నరసింహ అనే యువకుడు బీబీనగర్లో ఓ వెంచర్లో విద్యుత్ స్తంభానికి ఉరి వేసుకుని మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.

Similar News

News March 1, 2026

నల్గొండ: పంచాయతీ నిధులపై పాత, కొత్త ‘సర్పంచుల’ పోరు

image

గ్రామ పంచాయతీలకు విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం ఇప్పుడు పాత, కొత్త సర్పంచుల మధ్య చిచ్చు పెడుతోంది. గతంలో పూర్తి చేసిన పనులకు సంబంధించి సుమారు రూ.50 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రస్తుత నిధుల నుంచి ఆ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త సర్పంచులు తమ అభీష్టం మేరకే
నిధులు ఖర్చు చేస్తామంటున్నారు. పాత బిల్లులు చెల్లించాలని మాజీలు డిమాండ్ చేస్తున్నారు.

News March 1, 2026

నల్గొండ: రైతు భరోసా కోసం ఎదురుచూపులు

image

జిల్లాలో యాసంగి సాగు పనులు చివరి దశకు చేరుకున్నా, పెట్టుబడి సాయం అందక 10.82 లక్షల మంది అన్నదాతలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఏటా నవంబర్‌లోనే విడుదల కావాల్సిన ‘రైతు భరోసా’ నిధులు ఇప్పటికీ ఖాతాల్లో జమ కాకపోవడంతో వరి, మిర్చి సాగుదారులు అప్పుల కోసం ఎదురుచూస్తున్నారు. సాగు కాలం ముగుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

News March 1, 2026

నల్గొండ: ఉచిత బ్యూటీషియన్ కోర్సు.. దరఖాస్తుల ఆహ్వానం

image

నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం)లో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. మార్చి 4వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ కోర్సుకు 8వ తరగతి ఉత్తీర్ణత సాధించి, 18 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు అర్హులు. ఆసక్తి గలవారు తమ విద్యా అర్హత పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో నేరుగా ప్రాంగణంలో సంప్రదించాలని మేనేజర్ అనిత తెలిపారు.