News December 15, 2025
యాదాద్రి: ‘ఎన్నికల డ్యూటీ ట్రైనింగ్ డబ్బులివ్వాలి’

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల డ్యూటీ అలాట్ అయిన సిబ్బందికి రెండు రోజుల ట్రైనింగ్ డబ్బులు ఇవ్వలేదని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి దేశ ఎన్నికల్లో ప్రొసైడింగ్ ఆఫీసర్గా డ్యూటీ అలాట్ కాకుండా 2nd ఫేజ్ అలర్ట్ అయిన వారికి డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు. బీబీనగర్, భూదాన్ పోచంపల్లి, భువనగిరి, వలిగొండ మండల వారికి న్యాయం చేయాలని Way2News ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.
Similar News
News December 20, 2025
ఎద్దు అడుగులో ఏడు గింజలు పడితే పంట పలచన

నాగలితో దున్నుతూ విత్తనాలు వేసేటప్పుడు, ఎద్దు వేసే ఒక అడుగు దూరంలో ఏడు గింజలు పడ్డాయంటే అవి చాలా దగ్గర దగ్గరగా పడ్డాయని అర్థం. ఇలా విత్తనాలు మరీ దగ్గరగా మొలిస్తే మొక్కలకు గాలి, వెలుతురు సరిగా అందవు. నేలలోని పోషకాల కోసం మొక్కల మధ్య పోటీ పెరిగి ఏ మొక్కా బలంగా పెరగదు. ఫలితంగా పంట దిగుబడి తగ్గి పలచగా కనిపిస్తుంది. అందుకే పంట ఆశించిన రీతిలో పండాలంటే విత్తనాల మధ్య తగినంత దూరం ఉండాలని ఈ సామెత చెబుతుంది.
News December 20, 2025
శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి వెలిగిస్తే..?

శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి వెలిగించడం వల్ల వెలువడే సుగంధభరితమైన పొగ మానసిక ప్రశాంతతను ఇచ్చి, మనలోని సోమరితనాన్ని, ప్రతికూల ఆలోచనలను పారద్రోలుతుందని పండితులు చెబుతున్నారు. ‘ఆధ్యాత్మికంగా చూస్తే.. ఈ ధూపం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి ఈతిబాధలు తొలగిపోతాయి. అలాగే సకల దేవతల అనుగ్రహం లభించి, కుటుంబంలో సుఖశాంతులు చేకూరుతాయి. మనసు ఉల్లాసంగా మారి పనుల పట్ల ఉత్సాహం పెరుగుతుంది’ అంటున్నారు.
News December 20, 2025
సిద్దిపేట: ట్రాన్సజెండర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఉపాధి పునరావాస పథకం కింద ట్రాన్స్ జెండర్లకు బుుణాల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్ జెండర్ సంక్షేమ అధికారి శారద తెలిపారు. జిల్లాకు మొత్తం 5 యూనిట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ట్రాన్స్ జెండర్ల కోసం ఈ పథకం కింద రూ.75 వేల పూర్తి సబ్సీడితో రుణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. www.wdsc.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


