News February 13, 2025
యాదాద్రి: ఎన్నికల బరిలో 22 మంది!

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల బరిలో 22 అభ్యర్థులు నిలిచారు. ఈ నెల 10వ తేదీతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం ముగిసింది. ఈనెల 11న నామినేషన్ల పరిశీలనలో 23అభ్యర్థులకు గాను ఒక అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో 13న నామినేషన్ల ఉపసంహరణ పర్వం సైతం ముగిసింది.
Similar News
News January 1, 2026
OP సిందూర్కు రాముడే ఆదర్శం: రాజ్నాథ్

ఆపరేషన్ సిందూర్కు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ‘రాముడి లక్ష్యం కేవలం రావణుడిని చంపడమే కాదు.. అధర్మాన్ని అంతం చేయడం. మేం కూడా ఉగ్రవాదులకు, వాళ్లను పెంచి పోషిస్తున్న వారికి గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా OP సిందూర్ చేపట్టాం’ అని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమాల్లో రామ జన్మభూమి ఉద్యమం ఒకటని, 5 దశాబ్దాలకు పైగా కొనసాగిందని పేర్కొన్నారు.
News January 1, 2026
మామిడి తోటల్లో పూత రాలేదా? ఏం చేయాలి?

ప్రస్తుతం మామిడి చెట్లలో కొన్నింటికి పూత మొగ్గలు కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల మాత్రం ఎలాంటి పూత కనిపించడం లేదు. దీని వల్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. చలి తీవ్రత, పొగ మంచు, ఇతర అంశాలు ఈ పరిస్థితికి కారణం అంటున్నారు నిపుణులు. మామిడిలో మంచి పూత రావాలంటే ఏం చేయాలి? నీరు అందించడంలో జాగ్రత్తలు, తేనె మంచు, బూడిద తెగులు కనిపిస్తుంటే ఎలాంటి మందులు పిచికారీ చేయాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 1, 2026
కర్నూలు, నంద్యాల జిల్లాల న్యూస్ రౌండప్

★ నేటి నుంచి రేషన్ పంపిణీ
☞ సంక్రాంతి కానుకగా రూ.20కే కిలో గోధుమ పిండి
★ ఆదోని మండలం-2 పాలన మొదలు
★ రేపటి నుంచి కందుల కొనుగోళ్లు షురూ
★ ఎమ్మిగనూరులో 25 తులాల బంగారం చోరీ
★ జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా సాగిన న్యూ ఇయర్ సంబరాలు
★ నంద్యాల: జనవరి 17 నుంచి స్వచ్ఛరథం
★ కర్నూలు: గృహ లబ్ధిదారులకు సమస్యలా.. నేడు ఫోన్ ఇన్
☞ 08518257481
★ కొండారెడ్డి బురుజు వద్ద కేక్ కట్ చేసిన ఎస్పీ


