News February 13, 2025
యాదాద్రి: ఎన్నికల బరిలో 22 మంది!

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల బరిలో 22 అభ్యర్థులు నిలిచారు. ఈ నెల 10వ తేదీతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం ముగిసింది. ఈనెల 11న నామినేషన్ల పరిశీలనలో 23అభ్యర్థులకు గాను ఒక అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో 13న నామినేషన్ల ఉపసంహరణ పర్వం సైతం ముగిసింది.
Similar News
News November 3, 2025
ములుగు: మంత్రి గారూ.. జర చూడండి!

ఏటూరునాగారం(M) దొడ్ల వద్ద అనారోగ్యంతో ఉన్న ఇద్దరు పిల్లలను ఎత్తుకొని తల్లిదండ్రులు పీకల్లోతు <<18184088>>వాగుదాటిన<<>> విషయం తెలిసిందే. మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి దయనీయ పరిస్థితులపై జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. గత ప్రభుత్వం సమయంలో వాగు ఉద్ధృతి కారణంగా 8 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఆ 3 గ్రామాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది.
News November 3, 2025
RSV ఇన్ఫెక్షన్ను ఎలా నివారించాలంటే?

వర్షాకాలం, చలికాలంలో ఇన్ఫెక్షన్లు ప్రబలినప్పుడు గుంపులోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. బిడ్డను తీసుకొని ఫంక్షన్లకు వెళ్లకూడదు. దగ్గు, జలుబు ఉన్నవాళ్లకు తల్లిదండ్రులు, పిల్లలు దూరంగా ఉండాలి. సరైన ఇమ్యూనిటీ లేని పిల్లలకు RSV ఇమ్యూనోగ్లోబ్యులిన్ వ్యాక్సిన్ ఇస్తారు. పిల్లల్లో లక్షణాలు ఎక్కువగా ఉంటే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్కు తీసుకెళ్లాలి. పిల్లలకు పోషకాలున్న ఆహారం ఎక్కువగా ఇవ్వాలి.
News November 3, 2025
KNR: ప్రమాదాల కేంద్రంగా రోడ్లు.. హెవీ లోడ్స్తో చిద్రం

గ్రానైట్, ఇసుక రవాణాకు కేంద్రంగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హెవీ లోడ్ వాహనాలు నిత్యం వందలాదిగా తిరుగుతున్నాయి. ఇసుక, గ్రానైట్ లోడ్లతో రోడ్లు చిద్రమై వాహనదారులకు ప్రయాణం నరకంగా మారింది. మంథని-పెద్దపల్లి, కరీంనగర్ నుంచి చల్లూర్, WGL. JGTL, సిరిసిల్ల, హుస్నాబాద్ మార్గాల్లో పరిస్థితి దారుణం. ప్రమాదాల నియంత్రణకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోకుంటే, రంగారెడ్డి ఘటనలు ఇక్కడ పునరావృతమయ్యే ప్రమాదం ఉంది.


