News September 24, 2024

యాదాద్రి కలెక్టర్‌తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమీక్ష సమావేశం

image

పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి ఇంటిని సర్వే చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. నేడు ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హనుమంత్, జిల్లా అదనపు కలెక్టర్లు గంగాధర్, బెన్ షాలోమ్, ఆర్డీవో అమరేందర్, ఎలక్షన్ సెల్ డిప్యూటీ తహశీల్దార్ సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News September 29, 2024

కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం

image

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హనుమంత్ రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో ధరణి, ప్రజావాణి దరఖాస్తులు, వాల్డా చట్టంపై సమీక్షించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీ విషయంలో పెండింగ్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.బెన్ షాలోమ్, భువనగిరి ఆర్డీఓ అమరేందేర్, చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

News September 28, 2024

మిర్యాలగూడలో రామ్‌నగర్ బన్నీ చిత్ర యూనిట్

image

బుల్లి తెర నటుడు ప్రభాకర్ తనయుడు నటించిన రామ్ నగర్ బన్నీ టీం మిర్యాలగూడలో సందడి చేసింది. పట్టణంలో ఓ కళాశాలలో మూవీకి సంబంధించిన ప్రోమో జరిగింది. ప్రభాకర్‌తో పాటు హీరోహీరోయిన్లు హాజరయ్యారు. నేటి యువతను ఆకర్షించే విధంగా ఈ చిత్రం ఉంటుందని, ప్రతీ ఒక్కరూ సినిమాను ఆదరించాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీనాథ్, యాజమాన్యం వారిని ఘనంగా సన్మానించారు.

News September 28, 2024

సూర్యాపేట: ఆర్టీసీ బస్సులో ప్రసవం.. క్షేమంగా తల్లీబిడ్డలు

image

ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవించిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. ప్రయాణికులు తెలిపిన ప్రకారం.. బస్సు సూర్యాపేట నుంచి కోదాడ వెళుతోంది. గుడిబండకు చెందిన అలివేలు అనే గర్భిణీకి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. బస్సు డ్రైవర్, కండక్టర్ అప్రమత్తమై బస్సును పక్కకి నిలిపారు. మహిళా ప్రయాణికులు ఆమెకు సుఖప్రసవం చేశారు. మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.