News March 28, 2025
యాదాద్రి కొండపై శ్రీరామనవమి వేడుకలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 30 నుంచి వచ్చే నెల 9 వరకు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. అందులో ప్రధాన ఘట్టాలు ఏప్రిల్ 5న ఎదుర్కోళ్ల మహోత్సవం, 6న కళ్యాణ మహోత్సవం, 7న సీతారాముల పట్టాభిషేకం, 8న శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, 9న ఉత్సవాలకు స్వస్తి పలకనున్నారు.
Similar News
News February 20, 2026
కేయూ నుంచి పొలికేక వినిపించిన విద్యార్థులు..!

వరంగల్ కేయూ విద్యార్థులు స్వరాష్ట్ర ఉద్యమానికి పొలికేక వినిపించారు. 2009లో కేయూ విద్యార్థి జేఏసీగా ఏర్పాటు చేసి సంఘటితమై ఉధృతంగా ఉద్యమించారు. నిరాహార దీక్షలు, భారీ ర్యాలీలు, రాస్తారోకోలు, విశ్వవిద్యాలయ వేదికగా మేధోమథనం లాంటి కార్యక్రమాల ద్వారా పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. స్వరాష్ట్రం కోసం ఉజ్వల భవిష్యత్తును లెక్కచేయకుండా పలువురు విద్యార్థులు పోలీస్ కేసులు, జైలు జీవితాలను కూడా అనుభవించారు.
News February 20, 2026
సంకల్ప కళా గ్రామంలో విదేశీ ప్రతినిధుల సందడి

విశాఖలో జరుగుతున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భాగంగా పెందుర్తి సమీపంలోని సంకల్ప కళా గ్రామంలో సహజ రంగుల అద్దకంపై కార్యశాల నిర్వహించారు. నేవీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 50 దేశాల ప్రతినిధులు పాల్గొని చేనేతలు, లక్క బొమ్మలను పరిశీలించారు. విసరడం, దంచడం వంటి పురాతన పద్ధతులను స్వయంగా చేసి ఆనందించారు. అనంతరం కోలాటం, జానపద నృత్యాలతో అతిథులు సందడి చేశారు.
News February 20, 2026
ఉమ్మడి ప్రకాశం: కీలక సమావేశానికి రంగం సిద్ధం.!

ఈ నెల 22న అమరావతిలో CM చంద్రబాబు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ఇన్ఛార్జ్లు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలు పరిస్థితులపై సమగ్రంగా చర్చించనున్నారు. నియోజకవర్గాల్లో చేపట్టిన పనుల పురోగతిని విడివిడిగా సమీక్షిస్తూ, అభివృద్ధిలో వేగం పెంచేందుకు CM దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.


