News April 4, 2025

యాదాద్రి: తగ్గిన కోళ్ల ఉత్పత్తి.. పెరిగిన చికెన్ ధరలు

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో రెండు నెలల క్రితం కేజీ రూ.150 నుంచి రూ.180 మధ్యే ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ భయం తొలగడంతో పాటు రంజాన్ పండుగ నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరగడం, వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తుంది.

Similar News

News February 13, 2026

నేరేడుచర్ల: కౌన్సిలర్లుగా గెలిచిన భార్యాభర్తలు

image

నేరేడుచర్ల మున్సిపాలిటీ ఫలితాలలో భార్య భర్తలు ఇద్దరు కౌన్సిలర్లుగా విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి 4వ వార్డు అభ్యర్థిగా కొణతం మంజుల, 15వ వార్డు అభ్యర్థిగా కొణతం చిన్న వెంకట్ రెడ్డి ఇద్దరూ పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. గెలుపునకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. వారికి పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

News February 13, 2026

నీట్ ర్యాంకులతో B.Sc నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు

image

AP: నాలుగేళ్ల B.Sc (నర్సింగ్) కోర్సులో ప్రవేశాలను నీట్-UG పరీక్ష ర్యాంకుల ఆధారంగా కల్పించాలని GOVT నిర్ణయించింది. గతంలో ఇంటర్, ఈఏపీసెట్ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశాలు జరగ్గా గత ఏడాది APNCET పెట్టారు. అయితే 16000 సీట్లకు గాను 4000 మిగిలిపోయాయి. దీంతో వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ తాజా ప్రతిపాదనలు సమర్పించగా CM ఆమోదించారు. ఈ కోర్సులో ప్రవేశాలు కోరుకొనే వారు 2026-27 నుంచి నీట్-UG పరీక్ష రాయాల్సి ఉంటుంది.

News February 13, 2026

BIG BREAKING: గజ్వేల్: KCR ఇలాకాలో BRS గెలుపు

image

మాజీ సీఎం KCR ఇలాకా గజ్వేల్‌లో BRS విజయం సాధించి మున్సిపల్ పీఠం కైవసం చేసుకుంది. ఇక్కడ 20 వార్డులకు గాను 11 వార్డులు BRS సాధించింది. 7 వార్డులు కాంగ్రెస్, 1 వార్డు బీజేపీ, 1 వార్డు ఇతరులు గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 11 సాధించడంతో BRS మున్సిపల్ ఛైర్మన్ పీఠం దక్కించుకుంది. దీంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.