News November 17, 2025
యాదాద్రి: నేటి నుంచి పత్తి మిల్లులు బంద్

నేటి నుంచి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి మిల్లుల అసోసియేషన్ నిరవధిక బంద్ను పాటించనున్నట్లు పత్తి మిల్లుల అసోసియేషన్ తెలిపింది. కావున రైతులెవరూ మార్కెట్ యార్డ్కు పత్తిని తీసుకురావద్దని మిల్లుల యాజమాన్యం కోరింది. దీంతో ఇప్పటికే ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్న పత్తి రైతులు ఏం చేయాలో తెలీక అయోమయంలో పడిపోయారు. అధికారులు త్వరగా చర్చలు జరిపి మిల్లులు తెరుచుకునేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News November 17, 2025
లింగంపేట: భర్తకు దాహన సంస్కారాలు చేసిన భార్య

భర్త గుండె పోటుతో మృతి చెందడంతో భార్య దహన సంస్కారాలు నిర్వహించారు. లింగంపేట మండల కేంద్రానికి చెందిన బాలయ్య ఆదివారం గుండెపోటుతో చనిపోయారు. ఆయనకు కొడుకు గతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాలయ్య భార్య సత్యవ్వ దహన సంస్కారాలు నిర్వహించింది. గ్రామంలో అంతిమయాత్రను చూసిన గ్రామస్థులు కంటతడి పెట్టారు.
News November 17, 2025
నాకు రాముడు అంటే ఎప్పుడూ ఇష్టం లేదు.. రాజమౌళి పాత ట్వీట్ వైరల్

తనకు దేవుడంటే నమ్మకం లేదంటూ <<18300800>>రాజమౌళి<<>> చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్న వేళ ఆయన పాత ట్వీట్ వైరల్ అవుతోంది. 2011లో ఓ అభిమాని జక్కన్నకు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పారు. ‘థాంక్యూ. కానీ నాకు రాముడు అంటే ఎప్పుడూ ఇష్టం లేదు. అన్ని అవతారాల్లో కృష్ణుడు నా ఫేవరెట్’ అని రిప్లై ఇచ్చారు. మరి రాముడి పేరుతో సినిమాలు తీసి డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నారు? అని నెటిజన్లు ఫైరవుతున్నారు.
News November 17, 2025
సంగారెడ్డిలో అద్భుత దృశ్యం ఆవిష్కరణ

సంగారెడ్డి పట్టణం మహబూబ్ సాగర్ చెరువు కట్ట హనుమాన్ మంత్రం సమీపంలో సోమవారం తెల్లవారుజామున అద్భుత దృశ్యం ఆవిష్కర్తమైంది. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో పసుపు పచ్చని కాంతులతో పంట పొలాలు మారాయి. ఈ అద్భుత ఘట్టాన్ని కొందరూ తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. సూర్యుడిని చూసేందుకు ప్రజలు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు.


