News March 15, 2025
యాదాద్రి: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

ఎండ తీవ్రత పెరిగిన దృష్ట్యా శనివారం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరగనున్నాయి. పదో తరగతి ఎగ్జామ్స్ సెంటర్ స్కూల్స్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి. అటు ఈనెల 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Similar News
News December 15, 2025
MDK: గతంలో పారిశుద్ధ్య కార్మికుడు.. నేడు ఉపసర్పంచ్

ఐదేళ్లుగా పారిశుద్ధ్య కార్మికుడు, ట్రాక్టర్ డ్రైవర్గా విధులు నిర్వహించిన యువకుడు ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. నార్సింగి మండలం శేరిపల్లికి చెందిన చెప్యాల విజయ్ కుమార్ గ్రామంలో రెండో వార్డులో పోటీ చేసి 36 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో గ్రామంలో గత రాత్రి జరిగిన ఉపసర్పంచ్ ఎన్నికల్లో విజయ్ కుమార్ను ఉపసర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
News December 15, 2025
‘పెద్దపల్లి జిల్లాకు సెమీకండక్టర్ యూనిట్ ఇవ్వాలి’

జిల్లాకు సెమీకండక్టర్ యూనిట్ ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఢిల్లీలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్కు వినతిపత్రం ఇచ్చారు. పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సెమీకండక్టర్ ఇండస్ట్రీకి సరిపడా వనరులు, స్కిల్డ్ యువత జిల్లాలో ఉన్నారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లానని ఎంపీ పేర్కొన్నారు. గతంలోనే పెద్దపల్లికి రావాల్సిన ఇండస్ట్రీని చంద్రబాబును సంతోష పెట్టేందుకు APకి తరలించారన్నారు.
News December 15, 2025
300 పోస్టులు.. 3 రోజుల్లో ముగుస్తున్న దరఖాస్తు గడువు

OICL 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ DEC 18తో దరఖాస్తు గడువు ముగుస్తోంది. పోస్టులను బట్టి డిగ్రీ, MA పీజీ గల వారు అర్హులు. జనవరిలో టైర్-1, ఫిబ్రవరిలో టైర్-2 ఎగ్జామ్స్ ఉంటాయి. పూర్తి వివరాల కోసం ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అధికారిక సైట్, అప్లికేషన్ కోసం IBPS సైట్ చూడండి.


