News January 3, 2026

యాదాద్రి: నేటి నుంచే ‘టెట్’.. సర్వం సిద్ధం

image

టెట్ శనివారం నుంచి ఈనెల 31 వరకు ఆన్‌లైన్ పద్ధతిలో జరగనుంది. ప్రతిరోజూ 2 విడతల్లో (ఉదయం 9-12, మధ్యాహ్నం 2.30-5) పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 6,852 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అయితే, దేశ్‌ముఖి విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో మాత్రం 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

Similar News

News January 6, 2026

‘ఆరోగ్య పాఠశాల’ అమలుపై కలెక్టర్ సమీక్ష

image

విద్యార్థుల శారీరక, మానసిక వికాసమే ప్రధాన లక్ష్యంగా జిల్లాలో ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఆరోగ్య పాఠశాలపై సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆరోగ్యం, పరిశుభ్రత, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించడమే ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు.

News January 6, 2026

నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లను ప్రారంభించాలి: కలెక్టర్

image

నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లను ప్రారంభించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్‌లో నిర్మల్ ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీల్లో నిర్మల్ ఉత్సవాలు జరిపేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

News January 6, 2026

డీసీసీబీని అభివృద్ధి పథంలో నడిపించాలి: కలెక్టర్

image

జిల్లా సహకార పరపతి బ్యాంకు (డీసీసీబీ) కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా ఉండాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె బ్యాంకును సందర్శించి, వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు. రికవరీల శాతం పెంచాలని, డిపాజిట్ల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం బ్యాంకు క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్, సిబ్బంది అంకితభావంతో పనిచేసి బ్యాంకును బలోపేతం చేయాలని కోరారు.