News August 27, 2025
యాదాద్రి: పండుగ పూట విషాదం.. వ్యక్తి మృతి

పండుగ పూట యాదాద్రి జిల్లాలో విషాదాన్ని నింపింది. భూదాన్ పోచంపల్లిలో వినాయక చవితి మండపానికి కవర్ కడుతూ ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు సతీశ్(38) మండప పనులు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా తడిగా ఉన్న మండపం పైనుంచి జారి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కాగా, వెంటనే అతడిని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News August 27, 2025
ఈనెల 29న మంత్రుల సమావేశం రద్దు: కలెక్టర్

నంద్యాల జిల్లాలో మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులకు సంబంధించి ఈనెల 29న కర్నూలులో నిర్వహించనున్న మంత్రుల సమావేశం రద్దు అయినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. మంత్రి డా.నిమ్మల రామానాయుడు, మంత్రి సత్య కుమార్ యాదవ్ల సమావేశం రద్దు అయిందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు, ప్రజా ప్రతినిధులు గమనించాల్సిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
News August 27, 2025
HYD: రైల్వే అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెంచండి: DRM

సికింద్రాబాద్ రైల్వే అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెంచాలని DRM గోపాలకృష్ణన్ అధికారులు, ఇంజినీర్లను ఆదేశించారు. స్టీల్ వర్క్ దాదాపుగా చివరి స్థాయికి వచ్చినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఇప్పటికే వెయిటింగ్ అలా అందుబాటులోకి రాగా, త్వరలోనే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు వివరించారు.
News August 27, 2025
విజయవాడ: వర్షాలపై VMC అప్రమత్తం

భారీ వర్షాల నేపథ్యంలో VMC అప్రమత్తమైంది. నగరంలో ఏర్పడే సమస్యలను పరిష్కరించడానికి 43 మాన్సూన్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ధ్యాన్చంద్ర తెలిపారు. డ్రైనేజీలు పొంగడం, కొండరాళ్లు జారడం, రోడ్లపై నీరు నిలవడం వంటి సమస్యల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో ఈ బృందాలు కీలకపాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. శానిటేషన్, ప్లానింగ్, ఇంజనీరింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.